తెలంగాణ కోసం అమరులైన వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా నిత్య జ్వలిత దీప్తి అమరజ్యోతిని గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. దీంతో 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన దశాబ్ది ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు గ్రేటర్వ్యాప్తంగా అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. నలుమూలల నుంచి భారీ ఎత్తున చేపట్టిన బైక్ ర్యాలీలతో నగరం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. ట్యాంక్ బండ్ పరిసరాల్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేస్తూ సాగిన కళల ప్రదర్శన ఉద్వేగంగా సాగింది.
– సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ)
నగరం నడిబొడ్డున.. పాలనాసౌధం ఎదుట.. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా.. కలకాలం నిలిచేలా.. దీపం రూపంలోని ఈ అమరుల స్మారక కేంద్రంలో విశాలమైన సభా మందిరం, ఉద్యమ ప్రస్థాన చిత్ర ప్రదర్శన కోసం థియేటర్, ఉద్యమ ప్రస్థానాన్ని వివరించే ఫొటో గ్యాలరీ, ఉద్యమ చరిత్రకు సంబంధించిన గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశారు. మొదటగా పోలీసులు అమరవీరులకు గన్ సెల్యూట్ నిర్వహించారు. ఆ తర్వాత సభలో 10 వేల క్యాండిల్ లైట్స్ ప్రదర్శిస్తూ సీఎం కేసీఆర్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, అమర జ్యోతిని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు శాలువా కప్పి అభివాదం చేశారు. ఆపై అమరవీరులపై ప్రదర్శించిన ప్రదర్శనను సీఎం కేసీఆర్, ప్రజాప్రతినిధులు, అధికారులు తిలకించారు. 800 డ్రోన్లతో తెలంగాణ ఖ్యాతి నింగిని తాకేలా ప్రదర్శించిన షో అందరినీ ఆకట్టుకున్నది.
నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్నగర్ 2 బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీని గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. 15, 660 గృహాలు కలిగిన ఈ టౌన్ షిప్ను రూ. 1474.75 కోట్లతో నిర్మించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మొక్క నాటి నీళ్లు పోశారు.
హుస్సేన్ సాగర్ తీరాన.. అమరవీరుల స్మార కం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కొవ్వొత్తుల వెలుగులతో అమరవీరులకు సీఎం కేసీఆర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 800 డ్రోన్లతో వివిధ అంశాలపై ప్రదర్శించిన డ్రోన్ షో విశేషంగా ఆకట్టుకుంది.
‘వివిధ దేశాలకు రైలు విడి భాగాలను తయారు చేసే మేధా సంస్థ కొండగల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం గొప్ప విష యం. అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్లను తెలంగాణ బిడ్డలు తయారు చేయడం గర్వకారణం’ అని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని కొండగల్లో మేధా గ్రూపు నిర్మించిన రైల్వే కోచ్
ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు.