న్యూఢిల్లీ : దసరా వేడుకల తర్వాత దీపాల పండగ దీపావళి రానుండటంతో ఎటుచూసినా పండగ వాతావరణంతో (Festive Season) కోలాహలం కనిపిస్తోంది. పండగ అంటే పూజలు, అలంకరణలు ఆపై ఇష్టమైన వంటకాలతో విందు భోజనం ఊరిస్తుంటుంది. సంప్రదాయ వంటకాలు, స్వీట్స్, స్నాక్స్ అంటూ పసందైన డిష్లను ఇష్టంగా ఆరగిస్తుంటారు. నోరూరించే ఆహార పదార్ధాలు ఊరించినా వాటిలో హానికారక పదార్ధాలు, ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా అనేది కన్నేసిఉంచాలి.
ఫెస్టివ్ సీజన్లో ప్రేవుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహార పదార్ధాలను దూరం పెట్టాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఆయా ఆహార పదార్ధాల్లో దాగిఉండే ఇంగ్రెడియంట్స్ మన ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాకుండా ప్రేవుల్లో బ్యాక్టీరియా వ్యవస్ధకూ చేటు చేస్తాయి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రేవుల ఆరోగ్యం కీలకం. మనం తీసుకునే ప్రతి ఆహారం ప్రేవుల్లో బ్యాక్టీరియాను నిర్ధేశిస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారంతో ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి జీర్ణక్రియ సాఫీగా సాగి ఇమ్యూనిటీ మెరుగవుతుంది. అయితే ఆహార పదార్ధాల్లో రుచికి జోడించే పదార్ధాలు, నిల్వ ఉండేందుకు వాడే ప్రిజర్వేటివ్స్ ప్రేవుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కృత్రిమ తీపిపదార్ధాలు, కృత్రిమ రంగులు, అధికంగా సోడియం కలిసిన ఆహార పదార్ధాలను దూరం పెట్టడంతో పాటు పెరుగు, మజ్జిగ వంటి ప్రొ బయాటిక్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా ప్రేవుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
Read More :
ChatGPT | చాట్జీపీటీ సామర్ధ్యంపై ఓపెన్ఏఐ సహ వ్యవస్ధాపకుడు ఏమన్నారంటే..!