కాలి కండరాలు అప్పుడప్పుడూ పట్టేసినట్లు అవుతాయి. కాళ్లు తిమ్మిరెక్కుతాయి. ఇది చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఎటూ కదల్లేకపోతుంటాం. కాలు కిందపెట్టాలంటే నొప్పిగా ఉండడమే కాకుండా తిమ్మిర్లు చాలా అసౌకర్యంగా ఉంటాయి. అసంకల్పిత సంకోచం, బిగుతు ఫలితంగా కండరాలు విశ్రాంతి తీసుకోలేకపోవడం వల్ల తిమ్మిరి ఏర్పడుతుంది. ఎక్కువసేపు కూర్చొని పని చేయడం, గాయం మొదలైన వివిధ కారణాల వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తుతుంది. అయితే, కండరాల తిమ్మిరి సమస్య తగ్గేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు చెప్పారు.
1.నీళ్లు ఎక్కువగా తాగాలి..
డీహైడ్రేషన్ వల్ల కాళ్లు తిమ్మిరెక్కుతాయి. ఈ సమస్యనుంచి బయటపడాలంటే రోజులో ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలి. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్గా ఉంచుకోవాలి.
2. ఐస్తో మసాజ్ చేయాలి..
వాపు నుంచి తిమ్మిర్లవరకూ ఏ నొప్పినైనా తగ్గించుకోవాలంటే ఐస్తో మసాజ్ చేయాలి. ఓ గుడ్డలో ఐస్ముక్కలు వేసి నొప్పి ఉన్నచోట గట్టిగా రుద్దుతూ మసాజ్ చేయాలి. ఇలా చేస్తూ ఉంటూ తిమ్మిర్లు, నొప్పి తగ్గిపోతుంటాయి.
3. కాళ్లను స్ట్రెచ్ చేస్తూ ఉండాలి..
కాళ్లు తిమ్మిరెక్కినప్పుడు లేదా పట్టేసినప్పుడు అలాగే కూర్చుండొద్దు. నొప్పి ఉన్న కాలును స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల తిమ్మిరి, నొప్పి తగ్గిపోతుంది.
4. మసాజ్ చేయాలి..
కాలు తిమ్మిరెక్కిన లేదా నొప్పి కలిగినచోట ఆయిల్తో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. కండరాల తిమ్మిరిని ఎదుర్కోవడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
5.తిమ్మిరి ఉన్న ప్రాంతానికి విశ్రాంతి ఇవ్వండి..
తిమ్మిరి లేదా నొప్పిగా ఉన్న కాలును పైకి ఎత్తి ఉంచాలి. దాన్ని నొప్పి తగ్గేవరకూ అలాగే ఉంచాలి. తగినంత విశ్రాంతి ఇస్తే నొప్పి దానికంతట అదే తగ్గిపోతుంది.