రక్తంలోని వ్యర్థాలను తొలగించడంతోపాటు రక్త పోటును నియంత్రించడంలో కిడ్నీలదే కీలక పాత్ర. అందుకే బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. రక్తపోటు, మధుమేహం అతిగా ఉంటే కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం అధికం. అందుకని ఈ సమస్యలున్న వారు ఎప్పటికప్పుడు కిడ్నీ ఫంక్షనింగ్ టెస్టులు చేయించుకోవడం తప్పనిసరి. మన శరీరంలోని విష పదార్థాలను వడపోసి మూత్రం ద్వారా బయటికి పంపడంతోపాటు హార్మోన్లు, ఎంజైములను విడుదల చేయడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి.
కిడ్నీలలో ట్యూమర్లు :
సాధారణంగా కిడ్నీలలో మూడు కారణాల వల్ల ట్యూమర్లు(కణుతులు) ఏర్పడతాయి. అందులో ఒకటి పుట్టుకతో, రెండోది ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లతో, మూడోది జీన్ మ్యుటేషన్తో వస్తాయి. కిడ్నీ ట్యూమర్లు రెండు రకాలు.. 1. నెఫ్రోబ్లాస్టోమా 2. రీనల్సెల్ కార్సినోమా(ఆర్సీసీ).
నెఫ్రోబ్లాస్టోమా : మూత్రపిండాలలో పుట్టుకతో వచ్చే కణుతులను నెఫ్రోబ్లాస్టోమా ట్యూమర్లు అంటారు. ఇవి పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేదా వైద్యపరీక్షల సమయంలో బయట పడతాయి. నాలుగు నుంచి ఐదేండ్ల వయసులో.. అబ్బాయిల కంటే అమ్మాయిలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
రీనల్సెల్ కార్సినోమా : ఈ ట్యూమర్లు పెద్ద వయసు వారిలో కనిపిస్తుంటాయి. ఇవి కిడ్నీల నుంచి ఊపిరితిత్తులు, ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. కొన్నిసార్లు ఈ కణుతులు రెండు మూత్రపిండాల్లోనూ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వయసు పెరిగేకొద్దీ ఈ కణుతుల పరిమాణం కూడా పెరుగుతుంది. ధూమపానం ఎక్కువగా చేసేవారిలో ఇవి కనిపిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మహానగరాలలో ఈ కేసులు నమోదు అవుతున్నాయి. ధూమపానం, మద్యపానం, అధిక బరువు, జీన్ మ్యుటేషన్ తదితరాలు ఈ రకం కణుతులు ఏర్పడటానికి ప్రధాన కారణం.
లక్షణాలు :
చికిత్స పద్ధతులు : లాప్రోస్కోపిక్ పద్ధతిలో కిడ్నీలో ఏర్పడిన కణితిని తొలగించవచ్చు. క్యాన్సర్ రకం, వ్యాధి దశ ఆధారంగా కిడ్నీ మొత్తాన్ని తొలగించడం, అవసరమైతే కీమో, రేడియో థెరపీలను ఇవ్వాల్సి ఉంటుంది. కిడ్నీలో అధికంగా కణుతులు ఉన్నా లేక పెద్ద పరిమాణంలో ఉన్నా.. ఆ కిడ్నీని తొలగిస్తారు. శస్త్రచికిత్సలు మూడు పద్ధతుల్లో జరుపుతారు. 1. రాడికల్ నెఫ్రోక్టమి, 2. సింపుల్ నెఫ్రోక్టమి, 3. పార్షియల్ నెఫ్రోక్టమి
రాడికల్ నెఫ్రోక్టమి : మూత్రపిండాల్లో ఏర్పడిన కణితి పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు ఈ పద్ధతిలో శస్త్రచికిత్స జరుపుతారు. ఇందులో మూత్రపిండాలతోపాటు అడ్రినల్ గ్లాండ్స్, లింఫ్ నాళాలు, టిష్యూలనూ పూర్తిగా తొలగిస్తారు.
సింపుల్ నెఫ్రోక్టమి : ఈ పద్ధతిలో కణితి ఏర్పడిన మూత్రపిండాన్ని మాత్రమే తొలగిస్తారు. కణితి పరిమాణం ఆధారంగా శస్త్రచికిత్స చేస్తారు. తొలిదశలో వ్యాధిని గుర్తించి, కేవలం ఒకే మూత్రపిండాన్ని తొలగిస్తే రోగి సాధారణ జీవితాన్ని గడిపే అవకాశాలు ఎక్కువ. రెండు మూత్రపిండాలు తొలగించినప్పుడు లేదా ఒకటి తొలగించి, రెండోది సరిగ్గా పనిచేయనప్పుడు.. బాధితులకు డయాలసిస్ చేస్తూ వీలైనంత త్వరగా కిడ్నీ మార్పిడి చికిత్స చేయాల్సి ఉంటుంది.
పార్షియల్ నెఫ్రోక్టమి : ఈ పద్ధతిలో మూత్రపిండాలను తొలగించకుండా చికిత్స అందిస్తారు. పుట్టుకతో ఒకే ఒక్క మూత్రపిండం ఉండి, అందులో కణితి ఏర్పడినప్పుడు, కణితి ఉన్న ప్రాంతాన్ని మాత్రమే తొలగిస్తారు. రెండు మూత్రపిండాల్లో కణుతులు ఏర్పడిన సందర్భాలలోనూ కేవలం ట్యూమర్ ఉన్న ప్రదేశాన్ని మాత్రమే
తొలగిస్తారు.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98490 22121