Papaya | బొప్పాయి పండును తింటే మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీని వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ఇక డెంగీ వచ్చిన వారు ప్లేట్లెట్లు కోల్పోతుంటే బొప్పాయి పండు ద్వారా వాటిని కంట్రోల్ చేయవచ్చు. రక్తం కూడా వృద్ధి చెందుతుంది. అయితే బొప్పాయి పండును తినేవారు మాత్రంకొన్ని సూచనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే పండు తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు. గర్భిణీలు బొప్పాయి పండును ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే పలు రసాయనాలు నేరుగా గర్భాశయంపై ప్రభావం చూపుతాయి. దీంతో అబార్షన్ జరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక బొప్పాయి పండును గర్భిణీలు తినరాదు.
మనం తిన్న ఆహారాన్ని నోటి నుంచి జీర్ణాశయానికి అన్నవాహిక చేరవేస్తుంది. అయితే బొప్పాయి పండు వల్ల కొందరిలో ఈ అన్నవాహిక దెబ్బ తినవచ్చు. అంతేకాకుండా ఈ పండును బాగా తింటే ఎవరికైనా అన్న వాహికకు ఎఫెక్ట్ అవుతుంది. కనుక ఎప్పుడు ఈ పండును తిన్నా ఒక కప్పుకు మించరాదు. గర్భిణీలే కాదు, పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయి పండును తినరాదు. తింటే వారు ఇచ్చే పాలతో పలు రసాయనాలు బిడ్డ శరీరంలోకి వెళ్తాయి. దీంతో అవి శిశువులకు లోపాలను కలిగిస్తాయి. అనంతరం అవి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. కనుక పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయి పండును తినరాదు. బొప్పాయి పండు కొందరికి పడదు. అలర్జీని కలిగిస్తుంది. కనుక ఎవరు ఈ పండును తిన్నా ముందుగా ఒక చిన్న ముక్క తిని ఫరవాలేదు అనుకుంటేనే తినడం ఉత్తమం.
బీపీ సమస్యతో బాధపడేవారు, బీపీ ట్యాబ్లెట్లు వేసుకునే వారు బొప్పాయి పండును తినరాదు. తింటే సమస్య తీవ్రతరమవుతుంది. లో బ్లడ్ షుగర్ సమస్యతో బాధపడేవారు బొప్పాయి తినరాదు. తింటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు ఇంకా పడిపోతాయి. కనుక వారు తినరాదు. బొప్పాయి పండును తినే పురుషులు వాటి విత్తనాలను తినకుండా, అవి లోపలికి పోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అవి పురుషుల్లో వీర్యాన్ని నాశనం చేస్తాయి. ఇక బొప్పాయి పండును ఎవరైనా చాలా తక్కువగా తినాలి. రోజూ తినవచ్చు కానీ ఒక కప్పు మించకూడదు. మించితే శరీరంలో బెంజైల్ ఇసోథయోసయనేట్ అనే విష పదార్థం పేరుకుపోయి దాంతో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలుగుతుంది.
బొప్పాయి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ఆయా అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ పండ్లను తినకూడదు. కొందరికి బొప్పాయి పండ్లు పడవు. అలర్జీలను కలిగిస్తాయి. కనుక ఫుడ్ అలర్జీ ఉన్నవారు కూడా ఈ పండ్లను తినకపోవడమే మంచిది. బొప్పాయి పండ్లను రోజుకు ఒక కప్పు మోతాదులో తినాల్సి ఉంటుంది. ఈ పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ తరువాత ఒక గంట విరామం ఇచ్చి తినవచ్చు. లేదా మధ్యాహ్నం భోజనం అనంతరం ఒక గంట విరామం ఇచ్చి తినవచ్చు. బొప్పాయి పండ్లలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ సీజన్లో ఈ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. కానీ ఈ పండ్లను తినే వారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.