న్యూఢిల్లీ : జీవనశైలి మార్పులతో కడుపులో వేడి, మంటతో (Stomach Heat) పలువురు బాధపడుతుంటారు. డీహైడ్రేషన్, జీర్ణసమస్యలు కూడా ఈ పరిస్ధితికి దారితీస్తుంటాయి. కడుపులో మంట లక్షణాలను చూస్తే కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. జీర్ణక్రియను మెరుగపరిచి శరీరాన్ని చల్లబరిచే ఆహార పదార్ధాలతో ఈ ఇబ్బందులను అధిగమించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
కడుపులో మంటకు కారణాలను పరిశీలిస్తే డీహైడ్రేషన్, స్పైసీ, నాన్ వెజిటేరియన్ డిష్లను అధికంగా తినడం, అపరిశుభ్రంగా ఉన్న ఆహారం తీసుకోవడం వంటివి ముందువరసలో ఉంటాయి. కొందరిలో కడుపులో మంట అజీర్తితో పాటు పెప్టిక్ అల్సర్ల బారినపడే ముప్పునకూ దారితీస్తుంది.
అరటి పండును నిత్యం తీసుకుంటే ఇందులో ఉండే పోషకాలు శక్తిని ఇవ్వడంతో పాటు కడుపులో మంట లక్షణాల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. పొట్టలో ఎసిడిటీని బ్యాలెన్స్ చేయడంలో అరటి పండ్లు సాయపడతాయి. ఇక మజ్జిగ, దోసకాయ, కొబ్బరి నీళ్లు, పెరుగు నిత్యం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Read More :