Health Policy | మా ఖాతాదారులకు తక్కువ ప్రీమియంలోనే ఆరోగ్య బీమా అంటూ బ్యాంకులు హోరెత్తిస్తాయి. మా ఉద్యోగులకు అతి చవకగా హెల్త్ పాలసీలు అంటూ కార్పొరేట్ కంపెనీలు ఊరిస్తాయి. ఇలాంటివన్నీ గ్రూప్ పాలసీల కిందికి వస్తాయి. ఆయా సంస్థలకు నచ్చినంత కాలం మాత్రమే అవి అమలులో ఉంటాయి. ఒకవేళ బీమా కంపెనీలు ఆ సౌకర్యాన్ని ఆపేస్తే పాలసీని నమ్ముకున్న వాళ్లు నట్టేట మునగాల్సిందే.గ్రూప్ పాలసీలకు పోర్టబిలిటీ సౌకర్యం కూడా ఉండదని తెలుసుకోవాలి.
లా మధ్యతరగతి కుటుంబాలు హాయిగా, నిశ్చింతగా ఉన్నాయంటే కారణం.. సులువుగా లభిస్తున్న ఈఎంఐ ఆప్షన్లు, డిస్కౌంట్లు. అంతేకాదు ఆరోగ్య బీమా పాలసీలు కూడా మనుషులకు ధైర్యాన్ని, ప్రశాంతతను అందిస్తున్నాయి. ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా, బీమా పాలసీ ఉంది కదా అన్న ధైర్యం వారిలో ఉంటున్నది. అయితే, ఇక్కడే అసలు చిక్కు మొదలవుతుంది. ఈ పాలసీలు ఎక్కడ తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. ఈ విషయంలో అవగాహన లేకపోవడం వల్లే చాలామంది చిక్కుల్లో పడి, అప్పుల ఊబిలోకి దిగిపోతున్నారు. మరి ఏ పాలసీ ఎక్కడ తీసుకుంటే మంచిది? తక్కువ ధరల్లో వచ్చే ప్రీమియంలు తీసుకోవచ్చా? ముఖ్యంగా బ్యాంకులు అందించే గ్రూప్ పాలసీ మంచిదేనా?.. తదితర సందేహాలు ఇప్పుడు అందరిలో ఉంటున్నాయి.
ఆరోగ్య సమస్య మధ్యతరగతి కుటుంబాన్ని ఆర్థికంగా ఎంతో కుంగదీస్తుంది. అప్పటివరకూ దాచుకున్న సొమ్మంతా ఒకటి, రెండు రోజుల దవాఖాన బిల్లుకే సరిపోదు. అందువల్లే అవగాహన ఉన్నవాళ్లంతా ఆరోగ్య బీమా పాలసీలు కట్టుకుంటున్నారు. అయితే, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్లను ఆకర్షించాలంటే.. ఏం చేయాలి.. తక్కువ ప్రీమియంతో పాలసీల ఆశ చూపిస్తే చాలు. ఎగబడి కుటుంబాలకు కుటుంబాలే పాలసీలు తీసుకుంటాయన్నది బ్యాంకుల ఆలోచన. అందుకే ఇప్పుడు అన్ని బ్యాంకులూ ఆరోగ్య బీమా వ్యాపారాలు చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా ఈ రంగంలోకి దిగాయి. తక్కువ ప్రీమియం పేరుతో అందర్నీ తమవైపు లాగేస్తున్నాయి. చివరికొచ్చేసరికి వాళ్లకందరికీ గ్రూప్ ఇన్స్యూరెస్ పాలసీ అంటగడుతున్నాయి. అలా బీమా సంస్థలకు భారీ స్థాయిలో వినియోగదారులు లభించడంతో తక్కువ ప్రీమియంకే పాలసీలు ఇస్తున్నాయి. ఇలాంటప్పుడే ఒకటి, రెండేళ్లలో భారీగా క్లెయిమ్స్ రావడంతో..
ఎప్పుడైతే క్లెయిమ్ల వల్ల నష్టం వస్తుందో అప్పుడు, పాలసీ రెన్యువల్ ఆపేస్తాయి. అంటే అప్పటినుంచి వాళ్లకు బీమా వర్తించదు. ఈ సమయంలోనే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వాళ్లు దారుణంగా మోసపోవాల్సి వస్తుంది. ఆరోగ్యవంతులు కొత్త పాలసీకి వెళ్లాల్సిరావడంతో, సీనియారిటీని కోల్పోతారు.
పాలసీని కొనసాగించకుండా నిలిపేస్తున్నాయి ఆయా బ్యాంకులు, సంస్థలు. ఇక్కడే మధ్యతరగతి వినియోగదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది. ఉన్నట్టుండి వ్యాధి బారినపడితే.. నమ్ముకున్న పాలసీ తోడ్పడకపోవడంతో మళ్లీ అప్పులపాలు కాకతప్పడంలేదు.
తక్కువ ప్రీమియం కట్టే ఈ గ్రూప్ పాలసీల వల్ల వినియోగదారులకు నష్టాలే ఎక్కువ. సాధారణంగా కంపెనీల్లో ఉద్యోగులకు కూడా ఈ గ్రూప్ పాలసీలే ఉంటాయి. అయితే ఉద్యోగం చేస్తున్నంత వరకే ఆ పాలసీ వర్తిస్తుంది. అందుకే చాలామంది ఆఫీసు పాలసీతో సంబంధం లేకుండా ప్రైవేట్ పాలసీలు తీసుకుంటున్నారు. ఇది మంచి పరిణామమే కానీ, బ్యాంకుల ద్వారా మళ్లీ గ్రూపు పాలసీలకు వెళ్లడం బాధాకరం. గ్రూప్
పాలసీల సంగతి ఎలా ఉంటుందంటే.. ఈ బ్యాంకులు ఇన్స్యూరెన్స్ కంపెనీలతో కమీషన్ లెక్కన మూకుమ్మడిగా వినియోగదారులతో ప్రీమియంలు కట్టిస్తాయి. ఎప్పుడైతే క్లెయిమ్ల వల్ల నష్టం వస్తుందో అప్పుడు, పాలసీ రెన్యువల్ ఆపేస్తాయి. అంటే అప్పటినుంచి వాళ్లకు బీమా వర్తించదు. ఈ సమయంలోనే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వాళ్లు దారుణంగా మోసపోవాల్సి వస్తుంది. అంతేకాదు, ఆరోగ్యవంతులు కూడా కొత్త పాలసీకి వెళ్లాల్సిరావడంతో, సీనియారిటీని కోల్పోతారు. దానివల్ల దీర్ఘకాలిక రోగులు చాలా ఇబ్బందిపడతారు.
ఒక బీమా సంస్థ నుంచి పాలసీ తీసుకుంటే.. వాళ్ల సేవలు నచ్చకపోతే పాలసీ పోర్టబిలిటీ అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మన ఫోన్ నెట్వర్క్ పోర్టబిలిటీలాగే… ఒక పాలసీ కంపెనీ నుంచి మరో కంపెనీకి మారొచ్చు. అప్పుడు కూడా పాలసీ సీనియారిటీ పెరుగుతుంది. ఈ సీనియారిటీ ఉంటేనే, కొన్ని రకాల సర్జరీలు క్లెయిమ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇలా బ్యాంకుల నుంచి గ్రూప్ పాలసీ ఉన్నప్పుడు మధ్యలోనే పాలసీ ఆగిపోతే.. మరో కంపెనీలో కొత్తగా పాలసీ తీసుకోవాలి. అందువల్ల ఈ కేసులో పోర్టబిలిటీ అవకాశం ఉండదు. ఇలా ఏవిధంగా చూసుకున్నా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు అందించే తక్కువ ప్రీమియం గ్రూప్ పాలసీలకు దూరంగా ఉండటమే ఉత్తమం.
– ఎం. రాం ప్రసాద్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ram@rpwealth.in www.rpwealth.in