హైదరాబాద్ : సూర్యాపేటలో 47వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా గ్యాలరీ కూలి ప్రేక్షకులు గాయపడిన ఘటనపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గవర్నర్ అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటన దురదృష్టకరమని ఆమె విచారం వ్యక్తం చేశారు.