కావలసిన పదార్థాలు
సాబుదాన: ఒక కప్పు, సేమ్యా: అరకప్పు, పాలు: అర లీటరు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు, బాదం,
కిస్మిస్: అరకప్పు
తయారీ విధానం
సగ్గుబియ్యం బాగా కడిగి రెండు గంటలపాటు నానపెట్టాలి. ముందుగా స్టవ్మీద గిన్నెపెట్టి నెయ్యి వేసి కాగిన తర్వాత డ్రైప్రూట్స్ వేసి వేయించి తీసి అందులోనే సేమ్యా వేసి వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో పాలుపోసి మరగనిచ్చి అందులో వేయించిన సేమ్యా, చక్కెర వేసి బాగా ఉడకనివ్వాలి. సేమ్యా బాగా ఉడికిన తర్వాత నానపెట్టిన సాబుదానలోనీళ్లు వంపి మరుగుతున్న పాలలో వేసి మరో ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. పాయసం బాగా దగ్గరపడ్డ తర్వాత దింపుకుని పైనుంచి వేయించిన బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి సర్వ్ చేసుకోవాలి.