భారత ప్రజాస్వామ్యానికి మూలమైన రాజ్యాంగానికి అవసరానికి అనుగుణంగా అనేక సవరణలు జరిగాయి. కాలంతోపాటు మారుతున్న అవసరాలు, డిమాండ్లను తీర్చేందుకు ఈ సవరణలు ఉపయోగపడ్డాయి. వాటిలో కొన్ని నిపుణ పాఠకులకోసం..
-ఈ చట్టం 1984, సెప్టెంబర్ 11న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా ప్రకరణ 33(Sub)ను సవరించారు.
-దీనిద్వారా సాయుధదళాల ప్రాథమికహక్కులను నియంత్రించే అధికారం పార్లమెంటుకు కల్పించారు. ఇది రాష్ర్టాల ఆస్తులను కాపాడే సాయుధ దళాలు, రహస్య సమాచార సేకరణ సాయుధ దళాలు, రక్షక దళాలు, వాటికి సంబంధించిన బ్యూరోలు, వ్యవస్థల కోసం పనిచేసేవారు లేదా వాటికి సంబంధించినవారికి వర్తిస్తుంది.
-దీన్ని 1984లో చేశారు. అయితే 1986, జూలై 16న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా 330, 332 ప్రకరణలను సవరించారు.
-అస్సాంలోని స్వయం పాలిత ప్రాంతంలో ఉన్న షెడ్యూల్డ్ జాతులకు తప్ప, ప్రతి రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలకు, జాతులకు పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో రిజర్వేషన్లు కల్పించే విధంగా ప్రకరణ 300ను సవరించారు.
-332వ ప్రకరణను సవరించడం ద్వారా అస్సాం స్వయంపాలిత ప్రాంతాల్లో తప్ప అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్ర శాసనసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించారు.
-ఇది 1985, మార్చి 1న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా 101, 102, 190, 191 ప్రకరణలు, 10వ షెడ్యూల్ను సవరించారు.
-10వ షెడ్యూల్లో రాజకీయ పార్టీల ఫిరాయింపు నిరోధక చట్టాన్ని చేర్చారు.
-దీన్ని 1986లో చేశారు. 1987, ఫిబ్రవరి 20న అమల్లోకి వచ్చింది.
-దీనిద్వారా 1వ షెడ్యూల్కు సవరణ చేశారు. దీంతోపాటు ప్రకరణ 371-జీ చేర్చారు.
-ఈ చట్టం ద్వారా మిజోరం ప్రాంతాన్ని దేశంలో 23వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అక్కడ ఉండే సామాజిక, మత పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ర్టానికి కొన్ని ప్రత్యేక హక్కులను ప్రకరణ 371-జీలో పొందుపర్చారు.
-ఈ చట్టం 1986, ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా రెండో షెడ్యూల్ను, 125, 221 ప్రకరణలను సవరించారు.
-రెండో షెడ్యూల్లోని పార్ట్-డీని సవరించి సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జీతాలను, హైకోర్టు జడ్డీల జీతభత్యాన్ని పెంచారు.
-ప్రకరణ 125, 221లో జీతభత్యాలకు సంబంధించిన మార్పులు చేశారు.
-దీన్ని 1986లో చేశారు. 1987, ఫిబ్రవరి 20న అమల్లోకి వచ్చింది.
-ఇందులో 1వ షెడ్యూల్ను సవరించి, 371హెచ్ ప్రకరణను పొందుపరిచారు.
-కేంద్రపాలిత ప్రాంతమైన అరుణాచల్ప్రదేశ్ను 24వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. 371 హెచ్ ప్రకరణను చేర్చడం ద్వారా ఆ రాష్ర్టానికి ప్రత్యేక హక్కులు కల్పించారు.
-ఇది 1987, మే 30న అమల్లోకి వచ్చింది.
-1వ షెడ్యూల్ను సవరించి, 371ఐ ప్రకరణను చేర్చారు.
-గోవాను 25వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడంతోపాటు, ప్రకరణ 371ఐలో ఆ రాష్ర్టానికి సంబంధించిన ప్రత్యేక హక్కులు పొందుపరిచారు.
-ఇది 1987 సెప్టెంబర్ 21న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా ప్రకరణ 332ను, 22వ భాగాన్ని సవరించారు.
-332వ ప్రకరణను సవరించడం ద్వారా అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మేఘాలయాల్లో షెడ్యూల్డ్ జాతుల సీట్ల రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సవరణ 2000 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.
-దీన్ని 1987లో చేశారు. అదే ఏడాది డిసెంబర్ 9న అమల్లోకి వచ్చింది.
-394ఏ ప్రకరణను చేర్చారు. ఇందులో హిందీలోకి అనువదించిన రాజ్యాంగానికి, అసలు రాజ్యాంగానికి ఉన్న హోదా ఉంటుందని పేర్కొన్నారు.
-ఇది 1988, మార్చి 30న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా 21, 352, 356, 358 ప్రకరణలకు సవరణలు చేయగా, 359ఏ ప్రకరణను కొత్తగా పొందుపర్చారు.
-పంజాబ్లో రాష్ట్రపతిపాలన కాలపరిమితిని రెండేండ్ల నుంచి మూడేండ్లకు పెంచారు. అత్యవసర పరిస్థితి కారణంగా వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు రద్దుచేశారు.
-ఇది 1988, డిసెంబర్ 20న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా ప్రకరణ 276ను సవరించారు.
-దీనిద్వారా రాష్ట్రప్రభుత్వాలు విధించే వృత్తిపన్నును పెంచారు.
-ఈ చట్టాన్ని 1988లో చేశారు. 1989, మార్చి 28న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా 326వ ప్రకరణను సవరించారు.
-ఓటుహక్కు కనీస వయోపరిమితిని 21 నుంచి 18 ఏండ్లకు తగ్గించారు.
-ఇది 1989, డిసెంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చింది.
-ప్రకరణ 334ను సవరించారు.
-షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు, ఆంగ్లో ఇండియన్లకు లోక్సభ, శాసనసభల్లో రిజర్వేషన్లను మరో పదేండ్ల వరకు పెంచారు.
-దీన్ని 1989లో చేశారు. 1990, జనవరి 6న అమల్లోకి వచ్చింది. ఇందులో 359ఏ ప్రకరణను రద్దు చేయగా, 356వ ప్రకరణను సవరించారు.
-అంతర్గత కల్లోలాల కారణంగా పంజాబ్లో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కును సస్పెండ్ చేయకుండా ఉండటానికి 359ఏ ప్రకరణను రద్దు చేశారు.
-ఇది 1990, ఏప్రిల్ 16న అమల్లోకి వచ్చింది.
-356వ ప్రకరణను సవరించి పంజాబ్లో రాష్ట్రపతిపాలనను మరో 6 నెలలపాటు పొడిగించారు.
-దీన్ని 1990లో చేశారు. 1992, మార్చి 12న అమల్లోకి వచ్చింది. ఇందులో ప్రకరణ 338ని సవరించారు.
-ఈ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించి జాతీయ కమిషన్గా మార్చారు. అంతకుముందున్న స్పెషల్ ఆఫీసర్ అనే పదాన్ని జాతీయ కమిషన్గా మార్చారు.
-ఇది 1990, జూన్ 7న అమల్లోకి వచ్చింది. ఇందులో 9వ షెడ్యూల్ను సవరించారు.
-రాష్ర్టాలు చేసిన భూసంస్కరణల చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చారు. దీంతో ఆ చట్టాల సంఖ్య 257కు పెరిగింది.
-ఇది 1990, అక్టోబర్ 4న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా 356(4)వ ప్రకరణను సవరించారు.
-దీనిద్వారా పంజాబ్లో రాష్ట్రపతి పాలనను గరిష్టంగా నాలుగేండ్లకు పెంచారు.
-1991, మార్చి 12న అమల్లోకి వచ్చింది.
-356(4)వ ప్రకరణను సవరించి పంజాబ్లో రాష్ట్రపతి పాలనను గరిష్టంగా ఐదేండ్లకు పెంచారు.
-దీన్ని 1991లో చేశారు. 1992, ఫిబ్రవరి 1న అమల్లోకి వచ్చింది.
-239ఏఏ, 239ఏబీ ప్రకరణలను చేర్చారు.
-239ఏఏ ప్రకరణ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీని జాతీయ రాజధాని ప్రాంతంగా పరిగణిస్తారు.
-దాని పరిపాలకుడ్ని లెఫ్టినెంట్ గవర్నర్గా పిలుస్తారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతానికి ఒక శాసనసభ ఉంటుంది.
-జాతీయ రాజధాని ప్రాంతంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రకరణ 239ఏబీ వివరిస్తుంది.
-ఈ చట్టానికి 1991, డిసెంబర్ 21న పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ చట్టం 1992లో అమల్లోకి వచ్చింది.
-ఇందులో 54వ ప్రకరణ, 239ఏఏ ప్రకరణలను సవరించారు.
-దీనిద్వారా ఢిల్లీ, పాండిచ్చేరి అసెంబ్లీ సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల గణంలో భాగస్వామ్యం కల్పించారు.
-ఇది 1992, ఆగస్టు 31న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా 8వ షెడ్యూల్ను సవరించారు.
-ఇందులో కొంకణి, మణిపురి, నేపాలి భాషలను రాజ్యాంగలో చేర్చారు. దీంతో గుర్తింపు పొందిన భాషల సంఖ్య 15 నుంచి 18కి చేరింది.
-ఈ చట్టం 1992, డిసెంబర్ 5న అమల్లోకి వచ్చింది.
-ఇందులో 332 ప్రకరణను సవరించి దానికి 3బీ క్లాజు (332 (3బీ))ను చేర్చారు.
-ఈ సరవణ ద్వారా త్రిపుర శాసనసభలో గిరిజనులకు 20 స్థానాలు కేటాయించారు.
-ఈ సవరణ బిల్లుకు 1992లో పార్లమెంటు ఆమోదం తెలిపింది.
-1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.
-ఇందులో 280 ప్రకరణను సవరించి కొత్తగా 280 (3బీబీ) క్లాజును చేర్చారు. దీంతోపాటు 243 ప్రకరణను, 243ఏ-243ఓ వరకు, 11వ షెడ్యూల్ను కొత్తగా చేర్చారు. 9వ భాగంలో ద పంచాయత్స్ అని పొందుపర్చారు.
-పంచాయతీ సంస్థలకు దేశమంతా ఒకే మౌలిక విధానాన్ని అమలుపరుస్తూ, వాటికి రాజ్యాంగబద్ధత కల్పించారు.
-ఈ చట్ట సవరణ బిల్లును 1992లో పార్లమెంటు ఆమోదించింది. ఇది 1993, జూన్ 1న అమల్లోకి వచ్చింది.
-దీనిద్వారా 280 ప్రకరణను సవరించి 280 (3సీ)ని కొత్తగా చేర్చారు. దీంతోపాటు ప్రకరణలు 243పీ నుంచి 243జెడ్, 243జెడ్ఏ నుంచి 243జెడ్జీ వరకు పొందుపర్చారు.
-12వ షెడ్యూల్ను కొత్తగా చేర్చారు. దీంతోపాటు 9ఏ భాగంలో The Municipalities అని పొందుపర్చారు.
-ఈ చట్టం ద్వారా నగరపాలక సంస్థలకు దేశమంతా ఒక మౌలిక విధానాన్ని అమలుపరుస్తూ వాటికి రాజ్యాంగబద్ధత కల్పించారు.
-ఇది 1994, మే 15న అమల్లోకి వచ్చింది.
-దీనిద్వారా 323వ ప్రకరణను సవరించారు. దీనిద్వారా రాష్ట్రస్థాయిలో Rent Tribunalsకు అవకాశం కల్పించారు.
-ఈ చట్టం 1994, ఆగస్టు 31న అమల్లోకి వచ్చింది.
-ఇందులో 9వ షెడ్యూల్ను సవరించారు.
-విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 69 శాతం పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టానికి న్యాయసమీక్ష పరిధి నుంచి మినహాయింపునిస్తూ 9వ షెడ్యూల్లో చేర్చారు.
-ఇది 1995, జూన్ 17న అమల్లోకి వచ్చింది.
-దీనిద్వారా 16వ ప్రకరణను సవరించి 16 (4ఏ) క్లాజును చేర్చారు.
-షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించారు.
-ఈ సవరణ చట్టం 1995, ఆగస్టు 30న అమల్లోకి వచ్చింది.
-ఇందులో 9వ షెడ్యూల్ను సవరించారు. దీనిద్వారా బీహార్, కర్ణాటక, కేరళ, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ర్టాలకు సంబంధించి 27 భూ సంస్కరణల చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చారు. దీంతో ఈ షెడ్యూల్లో చట్టాల సంఖ్య 284కు పెరిగింది.
-ఈ రాజ్యాంగ సవరణ బిల్లును 1999లో పార్లమెంటు ఆమోదించింది. ఇది 2000, జనవరి 25న అమల్లోకి వచ్చింది.
-334 ప్రకరణను సవరించారు. దీనిద్వారా ఎస్సీ, ఎస్టీలకు, ఆంగ్లో ఇండియన్లకు లోక్సభలో, రాష్ర్టాల శాసనసభల్లో రిజర్వేషన్ల కాలపరిమితి పదేండ్లపాటు పొడిగించారు.
-దీనికి 1999లో పార్లమెంటు ఆమోదం తెలిపింది. 2000, జూన్ 9న అమల్లోకి వచ్చింది.
-దీనిద్వారా 268, 269 ప్రకరణలను సవరించి, 272వ ప్రకరణను తొలగించారు.
-10వ ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయడానికి ఈ సవరణలు చేశారు. సుంకాల రూపంలో కేంద్రానికి లభించే స్థూల రాబడిలో 29 శాతాన్ని రాష్ర్టాలకు కేటాయించాలి.