Apps:
Follow us on:

Photo Story | ఎదురెక్కి వస్తున్న కాళేశ్వరం జలాలను చూసి మురిసిపోతున్న రైతన్న..

1/12వరద కాలువలో నీళ్లొచ్చుడంటే పైనుంచి కిందికి పారుడే జూసినం. పైకెక్కుడంటే వింతగ ఉన్నది. వానల్లేకుంటే పోచంపాడ్‌ ప్రాజెక్టుకు నీళ్లు అస్తయా? అనుకున్నం.
2/12నీళ్లను ఎత్తిపోస్తరని చెబితే, చిన్న పనేమో అనుకున్నం. కానీ, గిదంతా జూస్తుంటే నమ్మలేకున్నం. మా కోసం, మా బతుకుల కోసం, మా సాగు పనుల కోసం సీఎం కేసీఆర్‌ గింతగానం పని చేస్తుంటే కండ్లపొంటి నీళ్లొస్తున్నయ్‌.
3/12శ్రీరాంసాగర్లకు నీళ్లు ఇట్ల కిందికెళ్లి గూడ వస్తయని అనుకోలె. కలల గూడా ఊహించనిది ఇయ్యాల కండ్లతోటి చూస్తుంటే మస్తు మంచిగ అనిపిస్తున్నది. మనస్సు సంబురపడుతున్నది.
4/12ప్రాజెక్టే ఆధునిక దేవాలయం. ప్రజల బతుకులను సౌభాగ్యంగా మార్చే నీళ్లే తీర్థం. ఇప్పుడలాంటి తీర్థయాత్ర శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టువైపు నడుస్తున్నది.
5/12వస్తాయో, రావోననుకున్న పోచంపాడుకు, కేసీఆర్‌ నిర్మించిన మానవాతీత ప్రాజెక్టు కాళేశ్వరం నుంచి జలాలు ఎదురెక్కి వస్తుంటే చూసి తీరాల్సిందేనంటూ రైతులంతా తరలివస్తున్నారు. బస్సుల్లో సమూహంగా పోచంపాడు బాట పట్టారు.
6/12కొందరైతే తమ కోసం బస్సులు వేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులను అడుగుతున్నారు. అసలే నిజామాబాద్‌లో రైతు చైతన్యం ఎక్కువ.
7/12కాళేశ్వరం నీళ్లు తరలివస్తుంటే చూడకుండా ఉంటారా! ఈసారి పొలాలకు రావనుకున్న నీళ్లను రప్పించటం ఎలా సాధ్యమైందంటూ ఓవైపు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, వాటిని చూసేందుకు ఆసక్తితో రైతు సంఘాల నాయకులు ప్రాజెక్టు వద్దకు వస్తున్నారు.
8/12భవిష్యత్తుతో ఇక పోచంపాడుకు గోదావరి వరద వస్తదా? రాదా? కాల్వలకు నీళ్లు పారుతయా? అన్న అవసరమే లేదు కదా! అన్న ఆలోచన వారిని ఆశ్చర్యపరుస్తున్నది. వానకాలం సీజన్‌ మొదలై నెలన్నర గడిచి పోయింది.
9/12ఇప్పటికే నాట్లు ముగియాల్సిన సమయం దాటిపోయింది. కానీ, ఈసారి కాలం కలిసిరాలేదు. చినుకు జాడ లేదు. గోదావరిలో వరద సవ్వడి లేదు. చుక్క నీరు లేక పంట పొలాలు బీళ్లుగా మారుతున్నాయి.
10/12రైతాంగం నిరుత్సాహానికి గురవుతున్న వేళ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూపంలో అన్నదాతలకు కొండంత అండ దొరికింది. ప్రకృతి ప్రకోపంతో వానలు కురియక పోయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి తిప్పలను తీర్చేందుకు కేసీఆర్‌ సిద్ధమయ్యారు.
11/12మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసి పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీ వరకు చేర్చుతున్నారు. రోజుకు అర టీఎంసీ చొప్పున వరదకాలువ ద్వారా కాళేశ్వరం జలాలు పరుగులు పెడుతూ శ్రీరాంసాగర్‌ను నింపుతున్నాయి.
12/12ఈ మహత్తర ఘట్టాన్ని నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని రైతులు ఆసక్తిగా తిలకిస్తూ మంత్రముగ్దులవుతున్నారు.