Apps:
Follow us on:

Photo Story | జజ్జనకర జనారే.. సినుకు సినుకు సితారే.. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వాన..

1/51ఆకాశానికి చిల్లు పడినట్లుగా నగరంలో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి.
2/51రోజంతా కురిసిన వర్షాలతో ఈ సీజన్‌లోనే అత్యధిక వర్షపాతం నమోదయింది.
3/51తెరిపివ్వని వానలకు పోటాపోటీగా జీహెచ్‌ఎంసీ అధికారులూ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు.
4/51పారిశుద్ధ్య సిబ్బందితో పాటు డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ట్రాఫిక్‌ పోలీసులు రోడ్లపై వర్షం నీరు నిలువకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నారు.
5/51ముందస్తుగానే అప్రమత్తం అయిన అధికారులు పౌరుల ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తూ పరిష్కారం చూపుతున్నారు.
6/51ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో వేగంగా సహాయక చర్యలను చేపడుతున్నారు.
7/51నగరంలోని చెరువులు, కుంటలలో వరద తాకిడిని అంచనా వేస్తూ దిగువకు నీరు వదులుతున్నారు.
8/51అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, కలెక్టర్‌ అనుదీప్‌, కమిషనర్‌ రోనాల్డ్‌రోస్‌ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ తగు చర్యలు చేపడుతున్నారు.
9/51కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ను 24 గంటలు పని చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం రాత్రి 7 గంటల వరకు 28 ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా,
10/5115 ప్రాంతాల్లో వాటర్‌ నిలిచి, మరో రెండు చోట్ల గోడ కూలిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లుగా ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.
11/51ఇదిలా ఉంటే అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని నగర పౌరులకు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.
12/51జనగామ జిల్లా వెల్దండ-అమ్మాపురం రహదారిపై వరదనీటిలో ప్రజలను సురక్షితంగా కల్వర్టు దాటిస్తున్న స్థానికులు
13/51ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు సాగుకు జీవం పోస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ముసురువానలోనే ఉత్సాహంగా వరినాట్లు వేస్తున్న కూలీలు
14/51నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలోని శీలం జానకీబాయి చెరువు నిండి మత్తడి దుంకుతున్నది. 54 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుండగా, ఈ ప్రాంతంలో పర్యాటకుల సందడి నెలకొంది
15/51భద్రాద్రి జిల్లా చర్ల మండలం పరిధి తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. 24 గేట్లు ఎత్తి 1,02,399 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్ట్‌ అధికారులు దిగువకు వదిలారు
16/51రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కాముని చెరువు అలుగు పారుతున్నది. పైనుంచి పాల ధార పోసినట్టు కనిపిస్తున్నట్టుగా సందర్శకులను ఆకట్టుకుంటున్నది
17/51సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌ బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగు
18/51ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పరవళ్లు తొక్కుతున్న మెదక్‌ జిల్లాలోని వనదుర్గా మధ్య తరహా ప్రాజెక్టు
19/51జలకళను సంతరించుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు
20/51యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలం ముక్తాపూర్‌లో వర్షంలో కవర్లు కట్టుకొని వరి నాట్లు వేస్తున్న కూలీలు
21/51వానలకు చెరువుల్లో పెద్దపెద్ద చేపలు రాగా, మత్స్యకారులకు ఉపాధి లభించింది. సిద్దిపేట జిల్లా మద్దూరులో చేపలు కొంటున్న గ్రామస్తులు
22/51వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజీ సమీపంలో ముసురు వానలో వరి నాట్లు వేసేందుకు కవర్లు కప్పుకొని వెళ్తున్న మహిళా కూలీలు
23/51వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలోని ఇల్లంద ఎస్సీకాలనీ ఇండ్లలో చేరిన వరద నీరు
24/51సిద్దిపేట జిల్లా సోలామైల్‌ వద్ద కొట్టుకుపోయిన జనగామ-సిద్దిపేట జాతీయ రహదారి
25/51నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కందకుర్తి శివారులో నీట మునిగిన సోయా పంట
26/51భద్రాచలంలో 43 అడుగులకు చేరిన గోదావరి ప్రవాహం
27/51హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో బోట్లతో సిద్ధంగా రెస్క్యూ ఆపరేషన్‌ సిబ్బంది
28/51ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో వాగు దాటించిన అనంతరం గర్భిణులతో డీఎంహెచ్‌వో అప్పయ్య, వైద్య సిబ్బంది
29/51ములుగు దవాఖానలో మగ బిడ్డకు జన్మనిచ్చిన బాలింత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న డీఎంహెచ్‌వో అప్పయ్య
30/51భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్లలో కూలిన రేకులఇల్లు
31/51
32/51వర్షం నీరు సాఫీగా వెళ్లేలా మ్యాన్‌హోళ్ల వద్ద చెత్తను తొలగిస్తున్న జీహెచ్‌ఎంసీ మాన్‌సూన్‌ బృంద సభ్యులు
33/51వర్షం నీరు సాఫీగా వెళ్లేలా మ్యాన్‌హోళ్ల వద్ద చెత్తను తొలగిస్తున్న జీహెచ్‌ఎంసీ మాన్‌సూన్‌ బృంద సభ్యులు
34/51వర్షం నీరు సాఫీగా వెళ్లేలా మ్యాన్‌హోళ్ల వద్ద చెత్తను తొలగిస్తున్న జీహెచ్‌ఎంసీ మాన్‌సూన్‌ బృంద సభ్యులు
35/51తిరుమలగిరిలో ఓ రోడ్డుపై కూలిన చెట్టును తొలగిస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది, పోలీసులు
36/51టెలిఫోన్‌ భవన్‌ వద్ద గొడుగులు పట్టుకున్న ప్రజలు
37/51కూకట్‌పల్లి అంబేద్కర్‌ వై జంక్షన్‌లో పరిస్థితిని పరిశీలిస్తున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాశ్‌ రెడ్డి, జడ్సీ మమత, ఎస్‌ఈ ఆనంద్‌
38/51తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ సమీపంలో..
39/51లింగంపల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద వరద నీరు నిలవడంతో హెచ్చరికను ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేసిన అధికారులు
40/51వరదనీటిని తొలగిస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది
41/51కూరగాయలమ్ముతున్న వ్యాపారులు
42/51హైటెక్స్‌ వద్ద..
43/51పంజాగుట్ట చౌరస్తాలో భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ శ్రావణ్‌ కుమార్‌ మ్యాన్‌హోల్‌ తెరిచి నీటిని తరలించారు. దీంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు సాఫీగా ముందుకుసాగాయి.
44/51అసెంబ్లీ రోడ్డులో కురుస్తున్న వర్షం..
45/51దుర్గం చెరువు తీగల వంతెన వద్ద..
46/51ఖైరతాబాద్‌లో కురుస్తున్న వర్షం
47/51సికింద్రాబాద్‌లో..
48/51ఖాజాగూడ రోడ్డు వద్ద..
49/51బయోడైవర్సిటీ రోడ్డు..
50/51రాయదుర్గం రోడ్డు ..
51/51 వర్షానికి తడవకుండా తార్పాలిన్‌ను ఏర్పాటు చేసుకున్న కూరగాయల వ్యాపారులు