దేశంలో నీటిపారుదల వ్యవస్థ సామర్థ్యం పెంపొందింపజేసి సమర్థవంతమైన నీటి నిర్వహణ, సమన్వయ పద్ధతి ద్వారా సాగుభూమిని వ్యవసాయ ఉత్పత్తి, వినియోగం కోసం కేంద్రప్రభుత్వం 1974 లో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించింది.
-ఇది దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం కోసం భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులపై ఏకీకృ త, సమగ్ర అభివృద్ధి కోసం రూపొందించిన పథకం.
-దీన్ని 5వ పంచవర్ష ప్రణాళిక (1974-80)లో భాగంగా చేపట్టారు.
-నీటిపారుదల ప్రాజెక్టుల కమిషన్ ఆదేశాలను క్రమపద్ధతిలో అభివృద్ధి పర్చి నీటిపారుదల సామర్థ్యం పూర్తిగా వినియోగించుకోవడం దీని ముఖ్యోద్దేశం.
-1972లో ఇరిగేషన్ కమిషన్ తన సిఫార్సులను కేంద్రానికి సమర్పించగా, తదనంతరం మంత్రుల కమిటీ సూచనల మేరకు ఇరిగేషన్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు.
-మొదట్లో 60 భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులను సీఏడీ ప్రోగ్రాం కిందకు తెచ్చారు.
-నీటిపారుదల వ్యవస్థలో లోపాలు, నీటి సరఫరా ఆటంకాలను సరిదిద్దుట, ప్రధాన కాలువలు, కొండ ల నుంచి చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు నీరు చేర్చ డం, మిగులు నీటిని చానెళ్ల ద్వారా బయటకు పంప టం, మధ్యతరహా కాల్వలకు పొడగించడం వంటివి చేపట్టడం.
-పునరేకీకరణలో భాగంగా ఫీడర్ కాలువలు, భూమి లెవలింగ్, సరిహద్దులు, కమతాల ఏకీకరణ తగిన పంట నమూనాలను పరిచయం చేయడం.
-2004 నుంచి పునర్వ్యవస్థీకరించి సమగ్రంగా రైతులకు ఉపయోగకరంగా చేయడానికి కమాండ్ ఏరి యా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంగా మార్పుచేశారు.