సాగు విస్తీర్ణం పెంపునకే చెక్డ్యాంల నిర్మాణం
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మోతె వాగుపై నిర్మిస్తున్న చెక్డ్యాం పనుల పరిశీలన
రామడుగు, మే 2: ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి ఆఖరి ఎకరాకు సాగునీరందించడమే తెలంగాణ సర్కారు లక్ష్యమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు నుంచి కొక్కెరకుంట వరకు మోతె వాగుపై రూ. 18 కోట్లతో నిర్మిస్తున్న 6 చెక్ డ్యాంల పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 14 చెక్డ్యాంలు నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో దుర్భిక్షం తాండవించేదన్నారు. ఈ దుస్థితిని గట్టెక్కించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువు కుంటల పునద్ధరణకు మిషన్కాకతీయకు శ్రీకారం చుట్టడమే గాకుండా ప్రాజెక్టుల ని ర్మాణానికి అంకురార్పణ చేశారని గుర్తుచేశారు.
ఇందులో భాగంగా కాళేశ్వరాన్ని మూడేండ్లలోనే పూర్తి చేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో చొప్పదం డి నియోజకవర్గం జలభాండాగారంగా మారిందన్నారు. ముఖ్యంగా గాయత్రీ పంపుహౌ స్, శ్రీ రాజరాజేశ్వర జలాశయాలు నియోజకవర్గంలో ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నా రు. నియోజకవర్గంలో నిర్మిస్తున్న 14 చెక్ డ్యాము ల పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్లకు సూ చించారు. ఇక్కడ ఎమ్మెల్యేతో వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, కొక్కెరకుంట విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, మాజీ ఎంపీటీసీ బత్తిని మునయ్యగౌడ్, మాజీ సర్పం చు, విండో డైరెక్టర్ ఊకంటి చంద్రారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు కలిగేటి లక్ష్మణ్ ఉన్నారు.