Apps:
Follow us on:

BRS Rally | ఖ‌మ్మంలో బీఆర్ఎస్ భేరీ.. ఫోటో గ్యాల‌రీ

1/21ఖమ్మం శివారులోని వీ వెంకటాయపాలెంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభలో అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్‌, కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు విజయన్‌, కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, సబితాఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని, కొప్పుల, బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కేకే, ఎంపీ నామా,  విప్‌ బాల్క సుమన్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం
2/21ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ కుంభమేళా
3/21ఖమ్మం శివారులోని వీ వెంకటాయపాలెంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు భారీగా హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు
4/21యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకొన్న ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌సింగ్‌ మాన్‌,మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చిత్రంలో యాదాద్రి కలెక్టర్‌ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత తదితరులు
5/21ఖమ్మం సభావేదికపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో ముచ్చటిస్తున్న సీఎం కే చంద్రశేఖర్‌రావు
6/21ఖమ్మం నగరంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ బహిరంగ సభ వేదికపై నుంచి ప్రజలకు విజయ అభివాదం చూపుతున్న సీఎం కేసీఆర్‌
7/21సభా వేదికపై సరదాగా మాట్లాడుకుంటున్న విప్‌ బాల్క సుమన్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి
8/21ఖమ్మం నగరంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ బహిరంగ సభ ప్రారంభమైనప్పటి నుంచి సీఎం కేసీఆర్‌ ప్రసంగం ముగిసే వరకు అశేష జన వాహిని జై కేసీఆర్‌.. జై బీఆర్‌ఎస్‌ అంటూ నినదించింది.
9/21ఖమ్మం బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌కు నాగలిని బహూకరిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. చిత్రంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌,  యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, ఎంపీ నామా
10/21సభా వేదికపై మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ, తలసాని, కొప్పుల, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి, అల్లోల, గంగుల, మల్లారెడ్డి, ఎంపీలు కేకే, నామా, వద్దిరాజు, పార్థసారథి, మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి తుమ్మల తదితరులు
11/21ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసిన ఢిల్లీ, కేరళ, పంజాబ్‌ సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, పినరాయి విజయన్‌, భగవంత్‌సింగ్‌ మాన్‌, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా. చిత్రంలో మంత్రులు తలసాని, వేముల, మహమూద్‌ అలీ, ఎంపీ సంతోష్‌కుమార్‌
12/21సభకు హాజరైన ఎంపీలు దీవకొండ దామోదర్‌రావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
13/21బేగంపేట విమానాశ్రయంలో ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్‌, భగవంత్‌సింగ్‌ మాన్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజాకు స్వాగతం పలుకుతున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
14/21సభా ప్రాంగణంలో ‘జై బీఆర్‌ఎస్‌' అంటూ నినదిస్తున్న యువత
15/21సభలో ఉత్సాహంతో ఈలలు వేస్తున్న మహిళలు
16/21ఖమ్మం సభలో మంత్రి పువ్వాడ ముఖచిత్రంతో కూడిన జెండా పట్టుకొని సీఎం కేసీఆర్‌ చిత్రపటాన్ని ప్రదర్శిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకురాలు
17/21ఖమ్మం కలెక్టరేట్‌ సముదాయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, సీఎంలు కేజ్రీవాల్‌, విజయన్‌, భగవంత్‌ మాన్‌, మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, డీ రాజా, మంత్రులు పువ్వాడ, వేముల, మాజీ మంత్రి తుమ్మల, తమ్మినేని తదితరులు
18/21ఖమ్మం కలెక్టరేట్‌ భవన సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్టర్‌ను అతిథులుగా వచ్చిన ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు పరిచయం చేస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో ఎంపీ నామా, ఎమ్మెల్సీ తాతా మధు
19/21ఖమ్మం కలెక్టరేట్‌తోపాటు కంటివెలుగు ప్రారంభోత్సవానికి హాజరైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అరవింద్‌ కేజ్రీవాల్‌,  భగవంత్‌సింగ్‌ మాన్‌, యూపీ మాజీ సీఎం, అఖిలేశ్‌ యాదవ్‌,  సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజాకు పరిచయం చేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
20/21సభకు అతిథిగా వచ్చిన కేరళ సీఎం విజయన్‌కు వీణను బహూకరిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రి హరీశ్‌రావు, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం
21/21ఖమ్మం సభావేదికపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌తో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌