సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘రిపబ్లిక్’. దేవాకట్టా దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 23న జీ తెలుగులో ప్రసారం కానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ వ్యవస్థ మీద మనందరి మనసులో వున్న మనోభావాలకు అద్దం పడుతూ , నిజాన్ని నిర్భయంగా ఎలుగెత్తిన సినిమాగా ‘రిపబ్లిక్’ అందరి మనసులు గెలుచుకుంది. థియేటర్తో పాటు ఓటీటీలో విడుదలై అందర్ని అలరించిన ఈ చిత్రం జీ తెలుగులో ప్రసారం కాబోతుంది. అందరూ తప్పకుండా చిత్రాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.