నేడు ఉపాధ్యాయ దినోత్సవం. గురుదేవులందరికీ శుభాకాంక్షలు. అలెగ్జాండర్ ఆయన గురువైన అరిస్టాటిల్ గురించి ఇలా అన్నారు- నా తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చారు. నాకు జీవితాన్నిచ్చింది మాత్రం నా గురువుగారే! ఉపాధ్యాయులకు దీనికి మించిన ప్రశంస లేదు. నిత్యం ఏదో ఒక విషయం గురించి తెలుసుకోవటమే టీచర్లకు మనం ఇచ్చే గౌరవం. విద్య అంటే తెలుసుకోవటం. ఇది జీవితాంతం సాగే యజ్ఞం.
ఇప్పుడు చంద్రయాన్ సంబురాలు కాస్త సద్దుమణుగుతున్నాయి. ఈ విజయం మనకు చెప్పే పాఠమేమిటి? చంద్రయాన్ చం ద్రుడి మీద సురక్షితంగా దిగటంతో యావత్ ప్రపంచం భారత శాస్త్రవేత్తల ప్రతిభా పాటవాల ను చూసి ఔరా అనుకొంది. మన శాస్త్రవేత్తల దీక్షా దక్షతలు చూసి దేశం గర్వపడింది. ఇది ఇస్రో విజయం. ఇది భారత సైన్స్ విజయం. స్వతంత్ర భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిన అద్భుత విజయం. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలకు ఎప్పటికీ మరువలేని గొప్ప ముగింపు. అయితే, మనకు సైన్స్ సం స్కృతి, జాతీయ సైన్స్ విధానం, సైన్స్ విద్య, శాస్త్రీయ దృక్పథం అనే అంశాలను ప్రోత్సహించటానికి విధాన రూపకల్పన అవసరం ఉన్నది. విధానాలు రూపొందించడం, అమలుచేయడం పాలకుల పనే అయినా ఇంత పెద్ద పని కేవలం పాలకులకు వదిలివేయటం మంచిది కాదు. దీని మీద విస్తృత చర్చ జరగాలి. ఇటీవల ప్రధాని ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగం విన్న చాలామందికి విచారం కలిగింది. శాస్త్రవేత్తలను అభినందించటం అభిలషణీయమే. కానీ ఆ సందర్భంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అశాస్త్రీయంగా ఉన్నాయి. మన ఉపగ్రహం దిగిన చోటును శివశక్తిగా నామకరణం చెయ్యటం పూర్తిగా అనాలోచితంగా ఉన్నది. సైన్స్ విజయానికి, మత విశ్వాసానికి సంబంధం లేదు. అటువంటి విజయానికి మతపరమైన పేరు పెట్టడాన్ని ఏమనుకోవాలి? హిందువులు కానివారు దీన్ని ఎలా చూస్తారు? చంద్రయాన్ దేశాన్ని ఒకటి చేసింది. అయితే మన ప్రధాని మాటలు ప్రజల ను మతం పేరుతో విభజించేవిగా ఉన్నాయి. సైన్స్ సాధించిన విజయానికి మతం రంగు పులమడమనేది అవిద్యతో కూడిన అవివేకం. ఇదే నా సైన్స్ విజయానికి, సైంటిస్టులకు మనమిచ్చే గౌరవం? అంతరిక్ష విజ్ఞానానికి పునాదులు వేసిన హోమీబాబా, విక్రమ్ సారాభాయ్ లాం టి వారి జీవితాలను గురించి చిన్నపిల్లలకు తెలియజేయాలి. వారిలో సైన్స్ పట్ల ఇష్టం పెంచాలి. అంతేకానీ ఇస్రోలో ఈశ్వర జపం ఏమిటి? మన నాయకులు ఏమైనా అనగలరు. ఎందుకంటే వారికి శాస్త్రీయ దృక్పథం లేదు గనుక.
చందమామ ఉపరితలానికి మన ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టడం విడ్డూరం. చందమామ ఏమన్నా భారతీయుల సొంతమా? అంతర్జాతీ య చట్టాలు, అవగాహన ఒప్పందాలు ఏం నిర్దేశిస్తున్నాయి? ఇదేనా విశ్వ గురువులు చేసే పని? ఇటువంటి పాలకులకు సైన్సు విధానం రూపొందించే బాధ్యతను అప్పజెప్పగలమా? అందుకే సైన్స్ విధానం మీద చర్చ అవసరం. మత విశ్వాసాన్ని పరిపాలనకు అజెండాగా చేసుకున్న వారికి శాస్త్రీయ దృక్పథం ఎక్కడినుంచి వస్తుంది? ఇస్రో కు భారతరత్న ఎందుకు ఇవ్వకూడదనేది ఆలో చించాల్సిన విషయం. సైంటిఫిక్ టెంపర్ అనే అంశం మీద చిన్నారుల్లో అవగాహన, ఆసక్తి కలిగించటానికి అనువైన చర్యలు తీసుకోవాలి. శాస్త్రీయ దృక్పథం విశ్వాసాలకు వ్యతిరేకం కాదు అన్న స్పృహను సమాజంలోకి తీసుకెళ్లాలి. ఈ స్ఫూర్తే నమ్మకాన్ని, మూఢ నమ్మకం నుంచి విడదీయటానికి మూలం కావాలి. నరనరాల్లో జీర్ణించుకున్న నమ్మకాలను కదిలించటం వ్యక్తి తనకు తానుగా సాధించాలి. అది బయటి ప్రేరణతో జరగడం బహు కష్టం. ముఖ్యంగా మనలాంటి సం ప్రదాయ సమాజంలో.
పిల్లలకు సైన్స్ పట్ల ఆలోచన, ఆసక్తి రేకెత్తించటానికి ముఖ్యంగా కావలసినది ప్రయోగశాల. ప్రభుత్వ హైస్కూళ్లలో ప్రయోగశాలలున్నా తగినన్ని పరికరాలు, పదార్థాలుండవు. ఈ పరిస్థితు ల్లో విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి ఏ విధంగా మొలకెత్తుతుంది? కేంద్ర ప్రభుత్వం దేశానికి విద్యావిధానం రూపొందిస్తుంది గానీ విద్య కోసం రాష్ర్టాలకు సరైన ఆర్థిక వనరులను మా త్రం సమకూర్చదు. మరి నేటి విద్యార్థులు రేపటి శాస్ర్తాజ్ఞులు ఎలా అవుతారు? మన హైస్కూళ్లలో సైన్స్ విద్యను ప్రోత్సహించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? చిన్నారుల మనసు సైన్సు వైపు మళ్లేవిధంగా చేపట్టాల్సిన కార్యాచరణ ఏమి టి? ఇటువంటి విషయాల మీద అధ్యయనానికి నిపుణుల కమిటీ కావాలి కానీ, జమిలి ఎన్నికల మీద కాదు. సైన్స్ను వ్యాప్తిచేసే విధంగా ఉపాధ్యాయులను ప్రోత్సహించాలి. నూతన బోధనా పద్ధతుల మీద టీచర్లలో అవగాహన కలిగించాలి. ప్రయోగశాలలను మెరుగుపరచాలి. హైస్కూళ్ల లో గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలి. మంచి పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. వీటన్నిటి కీ విధివిధానాలు కావాలి. అందుకే సైన్స్ విధా నం, సైన్స్ విద్య, సైన్స్ సంస్కృతి, శాస్త్రీయ దృక్ప థం వంటి అంశాల మీద విస్తృత చర్చ జరగాలి.
మత విశ్వాసాలు బలంగా నాటుకున్న సమాజంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించటం చాలా కష్టంతో కూడుకున్న పని. నమ్మకం అనేది మనిషి వ్యక్తిగత విషయం. నిజమే, విశ్వాసాల కు, విజ్ఞానానికి సంబంధం లేకపోవచ్చు. మహి ళా శాస్ర్తాజ్ఞులు కూడా శ్రావణ శుక్రవారం వరల క్ష్మీ వ్రతం జరుపుకోవచ్చు. విశ్వాసం వేరు, విజ్ఞానం వేరు. వీటి మధ్య సంఘర్షణ ఉండాల్సి న అవసరం లేదు. శాస్త్రవేత్తలకు విశ్వాసాలు ఉం డవచ్చు. భక్తి ఉన్నవారు శాస్త్రవేత్తలు కాకూడ దా? శాస్త్రవేత్తలకు భక్తి ఉండకూడదా? శాస్త్రవేత్త లు హేతువాదులుగా ఉండాలన్న నిబంధన ఏం లేదు. ఎందుకని ప్రశ్నించే ప్రతి మనిషి హేతువా దే. ఎందుకనే ప్రశ్న లేకుండా జీవితం లేదు. కానీ విశ్వాసం, విజ్ఞానం కలిస్తేనే సమస్య. మన ప్రధా ని నోటినుంచి శివశక్తి అనే మాట వచ్చినప్పుడు అది విశ్వాసం, విజ్ఞానం కలిసిపోయిన క్షణం. ఇది పెద్ద ప్రమాదానికి సంకేతం. జ్ఞానాన్వేషణ కు, జ్ఞాన సముపార్జనకు, సత్యశోధనకు విఘా తం కలిగించే మాట. ఇప్పుడు ప్రధాని అదే పని గా వల్లె వేస్తున్న మాట-వసుధైక కుటుంబకం. అంటే మానవజాతి అంతా ఒకే కుటుంబం. అలా అని మనం బాకా ఊదుకోవటమే గానీ, మనం అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లాలంటే వీసా కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. వీసా కార్యాలయాలకు వినిపించదు ఈ వసుధైక కుటుంబం గోల. అసలు ఇలాంటి విషయాలను కదా చర్చించాల్సింది జీ-20 లాంటి సదస్సుల్లో. కానీ సగటు మనిషి ఎదుర్కొనే సమస్యలను జీ-20 సదస్సులో చర్చించరు.
అసలు మనలాంటి పేద దేశానికి వేరే గ్రహాల మీదకు ఉపగ్రహాలను పంపటం అవసరమా? మన దేశ అవసరాలేమిటి? మన ప్రజల ఆశలు, ఆశయాలేమిటి? మన శాస్త్రవేత్తలు చేస్తున్నదేమి టి? అసలు చంద్రయాన్, ఆదిత్య మెషిన్ల జోలికి పోకపోతే మనకు వచ్చే నష్టమేంటి? ఈ మెషిన్ల వల్ల మనకు ఒరిగేదేమిటి? ఇస్రో అన్వేషణలు చేయాల్సిందే. కానీ అవి మనకు ఉపయుక్తంగా ఉండాలి. మనం వాతావరణాన్ని గురించి తెలుసుకోవటంలో చాలా వెనుకబడి ఉన్నాం. రైతు ఆరు గాలం కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షం కారణంగా మార్కెట్ యార్డులో తడిసిపోతుంది. వాన రాకట గురించి ముందుగా కచ్చితంగా తెలుసుకొనే పరిశోధన మనకు ఇప్పుడు అవసరం. కానీ, మనం ఒక వ్యసనానికి బానిసలమయ్యాం.
అదేమంటే అభివృద్ధి చెందిన దేశాలు చేసే ప్రతి పని మనమూ చెయ్యాలి. అందుకే అణు విస్ఫోటనం చేశాం. అంటార్కిటికాలో ప్రయోగ కేంద్రాన్ని స్థాపించాం. అంతరిక్షంలోకి భారతీయుడిని పంపించాం. ఇప్పుడు చందమామ మీద దిగిన నాలుగో దేశంగా గుండెలు బాదుకుంటున్నాం. తాజాగా సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రయోగించాం. ఇది దేశానికి ఏ విధంగా ఉపయోగం? ప్రజల అవసరాలేమిటి? పాలకుల ఆలోచన ఏమిటి? పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చి ప్రజల దృష్టి ని మళ్లించటానికి, ప్రజల్లో ఒక ఫాల్స్ ప్రిస్టేజి నింపడానికి చేసే ప్రయత్నం అనిపిస్తూ ఉంది ఈ ప్రయోగాలను ప్రోత్సహించడం చూస్తుంటే…
సైన్యం, సైన్స్ కష్టపడి సాధించే విజయాలను తమ విజయాలుగా చెప్పుకోవడం మన నాయకులకు అలవాటే. చంద్రయాన్ విజయాన్ని సైన్స్ విజయంగా కాకుండా శివయ్య విజయంగా చూడడం మిడీవల్ మెంటాలిటీ. 2004లో భారత్ వెలిగిపోతున్నదనే ప్రచారంతో ఎన్నికల కు పోయింది నాటి వాజపేయి ప్రభుత్వం. అప్పు డు ప్రజలు పదేండ్ల పాటు బీజేపీని చీకట్లోకి నెట్టారు. నేడు కూడా మరోసారి అలా చేయాల్సి న అవసరం ఉన్నది. ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో ఎవరు చెప్పగలరు?