చిత్తశుద్ధితో సంకల్పం చేసి, స్థిరచిత్తంతో, కార్యదక్షతతో ముందడుగు వేసినట్లయితే సత్ఫలితాలు లభించడం తథ్యం. ప్రజా నాయకుడు కేసీఆర్ ప్రజాభీష్టానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం సాధించాలని సంకల్పించారు. రాష్ట్రం సాధించారు, సాధించిన రాష్ర్టాన్ని సకల జనుల శ్రేయస్సు కోసం బంగారు తెలంగాణగా రూపొందించడానికి సంకల్పించారు. ఆ దిశలో అవసరమైన ప్రయత్నాలు జరుపుతూ, ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ కేసీఆర్ సంపూర్ణ విజయం సాధించబోతున్నారు.
స్వతంత్ర భారతదేశపు ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా మన రాజ్యాంగం ప్రసాదించిన ఫెడరల్ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరచడానికి సంకల్పించారు. అది చిత్తశుద్ధి గల సంకల్పమే. ఆ సంకల్పంలో భాగంగా ఆయన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పార్లమెంట్లో, బయట గల ప్రతిపక్ష నాయకులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.
ప్రతి జల బిందువును ప్రయోజనకారిగా మార్చడానికి, తెలంగాణ అంతట కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని అన్నపూర్ణగా రూపొందించడానికి కేసీఆర్ ఒక ఇరిగేషన్ ఇంజనీరింగ్ మిరాకిల్గా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలనుకున్నారు. కాళేశ్వరం నిర్మించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేండ్లకే ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలన్న ఆలోచన వచ్చింది. ‘ఇంత తక్కువ సమయంలో ప్రపంచ మహాసభల నిర్వహణ సాధ్యమా’ అని కొందరు భయపడ్డారు. కేసీఆర్ భయపడలేదు. కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా అనుకున్న సమయానికి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి ఆశ్చర్యం కలిగించాయి. రైతులకు, వ్యవసాయదారులకు స్వావలంబన కలిగించాలని సీఎం కేసీఆర్ సంకల్పించినప్పుడు అవహేళన చేసినవారున్నారు. కానీ, నిర్దిష్ట పథకాలతో కేసీఆర్ లక్షల మంది రైతులకు, వ్యవసాయదారులకు వ్యవసాయ వృత్తిలో స్వావలంబన కలిగించి తన సంకల్పాన్ని నెరవేర్చారు. ఏడాది కిందట సీఎం కేసీఆర్ తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, బహుభాషావేత్త, సారస్వతమూర్తి, బహుముఖ ప్రతిభావంతుడు పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవున ఘనంగా నిర్వహించాలని సంకల్పించారు. ఈ సంకల్పానికి తగినట్లుగా ఆయన ఒక కమిటీని నియమించి ఎన్నో చర్యలు తీసుకున్నారు. 2021 జూన్ 28వ తేదీన శతజయంతి రోజు హైదరాబాద్లో పలు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పీవీ శతజయంతి సందర్భాన ఒక మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కర్తను, మహా మేధావిని సముచిత రీతిలో గౌరవించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది. పీవీకి ‘భారతరత్న’ అవార్డు ఇంకా లభించకపోవడం శోచనీయం.
చిత్తశుద్ధితో సంకల్పించినట్లయితే, కార్యదక్షత ఉన్నట్లయితే సాధించలేనిదేమీ ఉండదని కేసీఆర్ గత ఏడేండ్ల నుంచి నిరూపిస్తున్నారు. ‘పల్మె ప్రళయ్ హోయ్గి, ఆజ్ కరైసో అబ్కర్’ అని సంత్ కబీర్ అన్నారు. తెలంగాణ బిడ్డ, భారత మహనీయుడు పీవీని సముచిత రీతిలో ఘనంగా గౌరవించడానికి సకాలంలో అనేక చర్యలు తీసుకొని, పలు కార్యక్రమాలు నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను గాఢంగా అభినందించవలసి ఉంటుం ది. తెలంగాణ ప్రభుత్వపు చొరవ అమెరికా తదితర అనేక దేశాల్లో స్ఫూర్తి కలిగిస్తున్నది ఇతర దేశాల్లో కూడా పీవీ శత జయంత్యుత్సవాలను సముచితరీతిలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నాయకత్వంలో, కోరిన రీతిగా పీవీకి భారతరత్న అవార్డు ఇవ్వడంతో పాటు హైదరాబాద్లోని కేంద్ర విశ్వ విద్యాలయానికి కూడా ఆయన పేరు పెట్టడం, ఆయన పేరిట ఆ విశ్వవిద్యాలయాన్ని ఒక స్మృతి చిహ్నంగా రూపొందించడం అత్యవసరం. పీవీ నాడు పుణేలోని ఫెర్గూసన్ కళాశాలలో ఉత్తమశ్రేణిలో బీఎస్సీ డిగ్రీ పొందారు. ఆయనకు ఆధ్యాత్మిక దృక్పథంతో పాటు సైన్స్ పట్ల ఎంతో గౌరవం ఉండేది. అందువల్ల ఆయన పేరిట కొన్ని సైంటిఫిక్ కేంద్రాలను కూడా అత్యాధునిక రీతిలో రూపొందించడం అత్యవసరం. విశేషించి, ఈరోజు మన దేశాన్ని, ప్రపంచాన్ని ఎంతో పీడిస్తున్న మహమ్మారి ‘కరోనా’ వ్యాధిపై కూడా ఇంత వరకు ఏ దేశంలోనూ సరైనపరిశోధన జరగలేదు. ఆ పరిశోధన పీవీ పేరిట నెలకొల్పే ఆరోగ్యవైద్య విజ్ఞానశాస్త్ర కేం ద్రాల్లో జరగడం సముచితం.
స్వతంత్ర భారతదేశపు ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా మన రాజ్యాంగం ప్రసాదించిన ఫెడరల్ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరచడానికి సంకల్పించారు. అది చిత్తశుద్ధి గల సంకల్పమే. ఆ సంకల్పంలో భాగంగా ఆయన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పార్లమెంట్లో, బయట గల ప్రతిపక్ష నాయకులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఆయా రాష్ర్టాల సమస్యల మీదనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ అం శాలపై కూడా నెహ్రూ వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. ఆ రోజుల్లో బీసీ రాయ్, రవిశంకర్ శుక్ల, గోవింద్ వల్లభ్పంత్, మొరార్జీ దేశాయ్, డీపీ మిశ్రా, బీజీ ఖేర్, సుచేత కృపలాని, నందినీ సత్పథి వంటి ముఖ్యమంత్రులు ప్రధానితో సమాన ప్రాముఖ్యం పొందేవారు. పార్లమెంట్లో, బయట జయప్రకాశ్ నారాయణ్, డాక్టర్ రావ్ుమనోహర్ లోహియా, ఆచార్య నరేంద్రదేవ్, పీలు మోదీ వంటి అతిరథ మహారథ ప్రతిపక్ష నాయకులు ఉండేవారు. వారందరికి నెహ్రూ తగినంత ప్రాధాన్యం ఇచ్చేవారు, వారి అభిప్రాయాలను గౌరవించేవారు.
దేవులపల్లి ప్రభాకరరావు