‘బైబిల్లో చెప్పినట్టు: మొదట దేవునితో అభిషేకించబడిన సౌలు ఆ తర్వాత దురాత్మ ప్రేరేపితుడైనట్టుగా ప్రస్తుతం కేఏ పాల్, ప్రజా అశాంతి పార్టీ పెట్టి స్పిరిచ్యు వల్ కమేడియన్గా మారారు’. ఈ వ్యాఖ్యలు పాల్ అంటే గిట్టనివారు చేసినవి కావు. క్రీస్తు ధర్మప్రచార పరిరక్షణ సమితి, ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య సంయుక్తంగా విడుదల చేసిన లిఖితపూర్వక ప్రకటనలో పేరొన్నారు. స్పిరిచ్యువల్ కామెడీతో, పొలిటికల్ కాంట్రవర్సీతో జోకర్గా మారి కేఏ పాల్ క్రైస్తవుల పరువు తీస్తున్నాడని వారు ఆ ప్రకటనలో వాపోయారు. అతని విచిత్ర వైఖరిని అసహ్యించుకొని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంస్థలతోపాటు తెలుగు రాష్ర్టాలలో ఆయనను బహిషరించామని, క్రైస్తవునిగా అతడిని గుర్తించడానికి కూడా అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాను పాల్ కలవడం వెనుక కూడా మతలబు ఉన్నదని, క్రైస్తవ మిషనరీల నుంచి నిధులు నిలిచిపోవడంతో, సహాయం చేయమని అడిగేందుకు కలిసారని ఈ సంస్థలు ఆరోపించాయి. ఇది ఇలా ఉంటే, ఒక విషయంలో మాత్రం పాల్ను అభినందించక తప్పదు. ‘స్పిరిచ్యువల్ కామెడీ’ అనే కొత్త పదం సృష్టికి కారకుడు అయినందుకు… ఏమంటారు?..