మహోన్నత వ్యక్తి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, దార్శనికుడు, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టడం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం. అదొక చారిత్రాత్మక నిర్ణయం. అంబేద్కర్ 132 వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున సచివాలయం పక్కన ఆయన 125 అడుగుల విగ్రహా న్ని ఆవిష్కరిస్తుండటం గర్వకారణం.
కులమతాలకతీతంగా ఆదరించబడుతున్న ఆదర్శమూర్తి భారతరత్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహన్ని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకొని స్ఫూర్తి పొందుతారు. దేశంలో సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి, త్యాగం ముందుతరాలకు ప్రేరణ కలిగిస్తుంది. అంటరానితనాన్ని అనుభవించిన అంబేద్కర్ అనేక కష్టాలను అధిగమించి ప్రపంచ జ్ఞానిగా చరిత్రలో నిలవడం ఆ జాతి బిడ్డలకే కాకుండా దేశానికే గర్వకారణం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చేతుల మీదుగా జరుగుతున్న ఈ విగ్రహావిష్కరణ నభూతో నభవిష్యత్. ఈ భారీ విగ్రహం రాజ్యాంగ నిర్మాత త్యాగనిరతికి సజీవ సాక్ష్యంగా, ముందుతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ మహత్కార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రికి, ప్రభుత్వ యంత్రాంగానికి ప్రణామాలు.
– అజ్మీరా సీతారాం నాయక్
(వ్యాసకర్త: మహబూబాబాద్ మాజీ ఎంపీ)