సిద్దిపేట, జూన్ 7: సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో బ్లాక్ ఫంగస్ బాధితుడికి శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సిద్దిపేట పట్టణానికి చెందిన మొహినొద్దీన్(75) కరోనాతో చికిత్స పొందుతూ బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. వెంటనే అప్రమత్తమైన వైద్యులు చికిత్సను అందించారు. సిద్దిపేట వైద్య కళాశాల ఈఎన్టీ ప్రొఫెసర్ నాగరాజు, ఈఎన్టీ వైద్యులు అశోక్రెడ్డి, ప్రిన్సిపల్ తమిళ అరస్, సూపరింటెండెంట్ జయశ్రీ, అనస్థీషియా డాక్టర్ చందర్ ఆధ్వర్యంలో సోమవారం ఆపరేషన్ చేసి బ్లాక్ ఫంగస్ను తొలగించారు. ఇటీవల మంత్రి హరీశ్రావు జరిపిన సమీక్షతో బ్లాక్ ఫంగస్ వార్డు ఏర్పాటు చేయడంతోపాటు ఈ కేసులకు అడ్డుకట్ట వేయాలని సూచించిన ఫలితంగా వైద్యులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. సిద్దిపేట దవాఖానలో 4 కేసులు ఉండగా మొదటి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతానికి రోగి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వారు తెలిపారు. మైక్రో డిబ్రాయిడరీ ఎండోస్కోపీ సహాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు చెప్పారు. ప్రైవేటు దవాఖానల్లో ఈ ఆపరేషన్ చేస్తే దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చయ్యేదన్నారు. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సిద్దిపేట వైద్య కళాశాల మెరుగైన సేవలను అందిస్తున్నది.