తిరువనంతపురం : కేరళలో బీజేపీకి మెజారిటీ సీట్లు గెలిచేందుకు అవకాశాలున్నాయని, అది సంపూర్ణ మెజారిటీ కావొచ్చు.. కింగ్ మేకర్గా నిలవొచ్చని ఆ పార్టీ నేత, మెట్రోమ్యాన్ శ్రీధరన్ పేర్కొన్నారు. పాలక్కాడ్లోని మలంపుజలో హోంమంత్రి రోడ్ షో అద్భుతంగా జరిగిందన్నారు. వేలాది మంది ఉత్సాహవంతులు తరలివచ్చారని, ఇది లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)ను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నానన్నారు. ప్రజలు బీజేపీకి ఓటు వేస్తారని అన్నారు. మెట్రోమ్యాన్గా పేరొందిన ఆయనకు.. రాజకీయ నాయకుడిగా పని చేయడం భిన్నంగా ఉందని తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే కేరళకు పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. వస్తే కేరళలో ప్రస్తుతం పరిశ్రమలు లేవని, పరిశ్రమలతోనే రాష్ట్రానికి సంపద తీసుకురాగలవని అభిప్రాయపడ్డారు. కేరళలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నందున ఉద్యోగాల కల్పన అవసరమని, విద్యావ్యవస్థ ప్రమాణాలు పెంపునకు కృషి చేస్తానని, సమర్థవంతమైన, అవినీతి రహిత పాలన అందిస్తానన్నారు. 140 మంది సభ్యుల కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనుండగా.. మే 2న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. 14వ కేరళ శాసన సభ పదవీకాలం జూన్ ఒకటితో ముగియనుంది. 15వ శాసన సభ ఎన్నికక కోసం 2,67,88,268 మంది అభ్యర్థులు ఓట్లు వేయనున్నారు.