బన్సీలాల్పేట్, మార్చి 10: బేగంపేట్లోని శ్యామ్లాల్ ప్రాంతంలో నివసించే దర్శనం దేవేందర్కు బుధవారం మంత్రి హరీశ్రావు ఫోన్ చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సాక్షాత్తు తాను అభిమానించే హరీశ్రావు తనకు ఫోన్ చేయడంతో ఆనందానికి గురైన దేవేందర్, తాను సురభివిద్యాసంస్థ అయిన శ్రీ వేంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీ పూర్వ విద్యార్థినని, అప్పట్లో వాణీదేవియే మా టీచర్ అని బదులివ్వడమే కాకుండా వాణీదేవిని గెలిపిస్తామని దేవేందర్ చెప్పారు.