అడ్డగుట్ట : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తుకారాంగేట్ శ్రీ పహాడి హనుమాన్ ఆలయంలో అంజనీపుత్రుడిని సింధూరం, లక్ష తమాలపాకులతో అలంకరించారు. పండుగ సందర్భంగా ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా అన్ని జాగ్రత్తలను తీసుకున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వెంకటరమణ చార్యులు అన్నారు.