మహేశ్వరం: ప్రతియేటా నిర్వహించె మహశివరాత్రి బ్రహ్మోత్సవాలలో బాగంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం అత్యంత కన్నుల పండువగ ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కార్తీక్రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలను దేవాస్థాన కమిటి చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్ తో కలిసి అందజేశారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం జబర్దస్త్ బృందం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమా లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కరోళ్ల ప్రియాంక రాజేష్, ఎంపీటీసీ సుదర్శన్యాదవ్, ఈవో మురళీకృష్ణ, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకులు కూనయాదయ్య, మండల పార్టీ అద్యక్షులు అంగోతు రాజునాయక్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.