బంజారాహిల్స్ : ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని అవహేళన చేయడం ద్వారా దళితుల మనోభావాలను కించపరిన నిజామాబాద్ ఎంపీ దర్మపురి అరవింద్ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెండ్రోజుల క్రితం తీన్మార్ మల్లన్నను జైల్లో కలిసేందుకు వెళ్లిన ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడే క్రమంలో తనమీదు న్న ఎస్సీ అట్రాసిటీ కేసు గురించి మాట్లాడుతూ ‘లొట్టపీసు కేసు’ అంటూ హేళనగా మాట్లాడారు. ఒక పార్లమెంట్ సభ్యుడి గా ఉంటూ దళితులకు రక్షణ కవచంగా పనిచేస్తున్న ఎస్సీ అట్రాసిటీ కేసుపై చులకనగా మాట్లాడడం నేరమన్నారు.
అరవింద్ మాటల ద్వారా యావత్తు దళితజాతి మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టారు.