దుండిగల్, జనవరి 9: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపాలే పండుగలని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జడ్పీహెచ్ఎస్ ప్రాంగణంలో వాసవీ క్లబ్ వనిత ఆధ్వర్యంలో నిర్వహించి ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్కు మేయర్ హాజరయ్యారు. ముగ్గుల పోటీలు మహిళల సృజనాత్మక శక్తిని వెలికి తీస్తాయని, రు. అనంతరం ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి పతంగిలు ఎగురవేశారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధన్రాజు, కార్పొరేటర్లు రవికిరణ్, జ్యోతి నర్సింహరెడ్డి, నగరపాలక కమిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు వాకలపూడీ రంగరాయప్రసాద్, బీసీ సెల్ అధ్యక్షుడు గోపాలకృష్ణ, వాసవీ క్లబ్ వనిత ప్రెసిడెంట్ గ్రంధిశీల రాగశైలజ, ప్రధాన కార్యదర్శి నమ్రత, కోశాధికారి వినీత తదితరులు పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు అందజేత
జీడిమెట్ల, జనవరి 9: సుభాశ్నగర్ డివిజన్ ఎస్ఆర్నాయక్నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు కార్పొరేటర్ గుడిమెట్ల హేమలత సురేశ్రెడ్డి బహుమతులు అందజేశారు. ప్రథమ కావ్య, ద్వితీయ తనుజా, తృతీయ బహుమతి దేవిప్రియ గెలుచుకున్నారు. కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.శ్రీనివాస్, నాయకులు రాజగోపాల్రెడ్డి, శివాజీ పాల్గొన్నారు.