ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులు
పరకాల, మే 1: రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని జడ్పీటీసీ సిలివేరు మొగిలి అన్నారు. శనివారం మండలంలోని వెంకటాపూర్లో ఓడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని పరకాల, మాదారం పీఏసీఎస్ చైర్మన్లు నల్లెల్ల లింగమూర్తి, గుండెబోయిన నాగయ్యతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కాగా, ప్రతిరైతు మాస్కు ధరించాలన్నారు. ఎంపీపీ తక్కళ్లపల్లి స్వర్ణలత, వెంకటాపూర్, హైబోత్పల్లి గ్రామాల సర్పంచ్లు సిలివేరు ఈశ్వరమ్మ, కంచ కుమారస్వామి, ఎంపీటీసీ పల్లెబోయిన సునీత పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విక్రయించాలి
చెన్నారావుపేట : రైతులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి అన్నారు. శనివారం మండల పరిధి ఎల్లాయగూడెం, ఉప్పరపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏవో కర్పూరపు అనిల్కుమార్, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని, మద్దతు ధర పొందాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సొసైటీ వైస్చైర్మన్ చింతకింది వంశీ, ఎల్లాయగూడెం సర్పంచ్ మంద జయ, ఉప సర్పంచ్ కందికొండ విజయ్, ఉప్పరపల్లి ఉపసర్పంచ్ కాసాని రమేశ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ విజేందర్రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు రమాదేవి, రాం బాబు, మంజుల, సరిత, బషీర్, రాంచంద్రయ్య, గోపి, సీఏ రవి, ప్రవీణ్కుమార్, ఏఈవోలు రఘుపతి, వినయ్, రైతులు, నాయకులు వీరయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
నెక్కొండ: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నెక్కొండ ఎంపీపీ జాటోత్ రమేశ్, చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయరెడ్డి అన్నా రు. శనివారం మండలంలోని గొల్లపల్లి, ముదిగొండ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్యతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్ రైతుల వెన్నంటి నిలిచి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రైతులు దళారులను ఆశ్రయించవద్దు
శాయంపేట: రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే పంట ఉత్పత్తులను విక్రయించాలని ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పత్తిపాక, శాయంపేట గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు అధైర్యపడొద్దని, చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు, నిర్వాహకులు విధిగా కరోనా నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం శ్రీధర్రెడ్డి, సర్పంచ్లు రవి, రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, నాయకులు రాంశెట్టి లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ దైనంపెల్లి సుమన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
రైతుల అభివృద్ధే ధ్యేయం
దామెర: రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ కాగితాల శంకర్ అన్నారు. శనివారం మండలంలోని సింగరాజుపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు ధాన్యంలో తేమ, తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రియాజొద్దీన్, ఏఎంసీ చైర్మన్ కాం తాల కేశవరెడ్డి, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, ఏఎంసీ వైస్చైర్మన్ మల్లయ్య, సంపత్, సత్యం, ఏపీఎం జాన్సీ, కుక్క అనీల్, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.