గిర్మాజీపేట, ఏప్రిల్ 11: అందరికీ ఆదర్శప్రాయుడు జ్యోతిరావు ఫూలే అని కలెక్టర్ బీ గోపి అన్నారు. సోమవారం బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 196వ జయంతిని స్థానిక జిల్లా పరిషత్ సమావేశ హాల్లో నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల పోరాటాల ఫలితంగానే మనం అన్ని హక్కులు సాధించుకున్నామని చెప్పారు.
వారిలో జ్యోతిరావు ఫూలే ఆదర్శప్రాయుడని అన్నారు. సమాజ మార్పు కోసం ప్రత్యేక చొరవతో కృషిచేసిన మహనీయుడని కొనియాడారు. ఫూలే సామాజిక సమస్యలపై పోరాడారని, విద్యతోనే అభివృద్ధి ఆధారపడి ఉందని, మారుమూల తండాల్లో బాలిక విద్య అందించేందుకు కృషిచేశారని వివరించారు.అదనపు కలెక్టర్ హరిసింగ్, బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి రవీందర్రెడ్డి, జడ్పీ సీఈవో రాజారావ్, డీఆర్డీఏ పీడీ సంపత్రావు, జాతీయ జ్యోతిరావు ఫూలే అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు ఉన్నారు.
వరంగల్: మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలను సాధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. సోమవారం ములుగు రోడ్డు జంక్షన్లోని ఫూలే విగ్రహానికి 195వ జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్యలో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సగ భాగం ఉన్న మహిళలకు విద్య అందుబాటులోకి తీసుకురావాలని శ్రమించిన మహనీయుడే ఫూలే అన్నారు. సమాజంలో లింగ వివక్షను తీవ్రంగా వ్యతరేఖించారని తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో వాసుచంద్ర, మహేందర్జీ, వెనుకబడిన తరగతుల ఉప సంచాలకులు, బీజీ నాయకులు పాల్గొన్నారు.