సుల్తాన్బజార్ : ఇంట్లో నుండి పారిపోయి వచ్చిన ఓ ప్రేమ జంటను చేరదీసి వారి తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్థిని వివాహం వేరొకరితో నిశ్చయం అయింది.
అయితే ఆ పెండ్లి ఇష్టం లేని అమ్మాయి పొరుగూరిలో ఉంటున్న ప్రియుడితో కలిసి పారిపోయి నగరానికి వచ్చారు. మంగళవారం ఉదయం సుల్తాన్బజార్ ఆర్య సమాజ్ పరిసరాలలో తచ్చాడు తుండగా అదే ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల కంటపడ్డారు.
వారిని అడ్డుకొని విచారించగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చి వివరాలు సేకరించారు. వారి నుండి పూర్తి వివరాలను సేకరించిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కు పిలిపించి అప్పగించారు.దీంతో వారి తల్లి దం డ్రులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.