మెదక్ అర్బన్, జనవరి 17: మార్కెట్లో డిమాండ్ ఉండి, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలు సాగు చేస్తే రైతులు అధిక ఆదాయం పొందవచ్చు. సాధారణంగా సాగు చేసే మక్క కాకుండా, తీపి మక్క (స్వీట్కార్న్), పేలాల మక్క, బేబీకార్న్ వంటి అధిక ప్రోటీన్లు ఉండే రకాలను సాగు చేస్తే లాభాలు గడించవచ్చు. ఈ నేపథ్యంలో స్వీట్కార్న్ పంట పద్ధతులపై ప్రత్యేక కథనం..
ఏ సమయంలోనైనా విత్తుకోవచ్చు…
స్వీట్కార్న్ తక్కువ కాలంలో కోతకు రావడమే కాకుండా నేరుగా తినే పదార్థంగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. స్వీట్కార్న్ ఒక్కో కంకిని రూ.20 చొప్పున మెదక్ బస్టాండ్, రామాయంపేట్ మెయిన్రోడ్డు వద్ద, తూప్రాన్ టోల్ప్లాజా వద్ద ఉడక బెట్టి విక్రయిస్తున్నారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఏ సమయంలోనైనా విత్తుకోవచ్చు. పంటకాలం కేవలం 75 నుంచి 80 రోజులు, కంకి దశలోనే విరవడంతో పచ్చిమేతగా కూడా ఉపయోగపడుతుంది. పచ్చి మేతను డెయిరీ ఫాంలకూ విక్రయించుకోవచ్చు. మార్కెట్ డిమాండ్ మేరకు రైతులకు ఒక్కో కంకికి రూ.8 నుంచి రూ.10 వరకు ధర వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణ మక్క కంటే తీపి మక్కలో 2 నుంచి 3 రెట్లు అధిక చక్కెర పదార్థాలు పోషకాలు. ఖనిజ లవణాలు ఉంటాయి. గింజ నిండిన తర్వాత గింజ గట్టి పడకముందే కోత కోయాలి. ఎకరాకు దాదాపు రూ.33 వేల పచ్చి కంకుల దిగుబడి వస్తుంది.
దశలవారీగా విత్తుకోవాలి…
తీపిమక్క పంటకు 19 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలం, అధిక ఉష్ణోగ్రత, మంచు, చలికి తట్టుకోదు. మురుగు నీరు పోయే వసతి ఉన్న ఎర్రరేగడి నేలలు, మధ్యరకపు రేగడి నేలలు అనుకూలం. నీరునిల్వ ఉండే నేలలు, చవుడు నేలలు పనికిరావు. ఎకరానికి నాలుగు కిలోల విత్తనం సరిపోతుంది. సాధారణ రకాలతో పోలిస్తే స్వీట్కార్న్ విత్తనాలు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. విత్తిన మరుసటి రోజు నీరు పెట్టాలి. తర్వాత మరో 4-5 రోజులకు నీరందించాలి. దీంతో మొలక శాతం పెరుగుతుంది. ఆ తర్వాత నీటి ఎద్దడి రాకుండా వారం రోజులకో తడి ఇచ్చేలా చూసుకోవాలి. కొంత భూమిలో విత్తనం వేసిన తర్వాత మరికొంత భూమిలో మరో 10 రోజులకు విత్తుకోవాలి. దీంతో స్వీట్కార్న్ కంకులు ఒకేసారి కోతకు రాకుండా, వివిధ రోజుల్లో రావడంతో మార్కెటింగ్ చేయడం సులభమవుతుంది.
ఎరువుల వాడకం కీలకం…
ఎకరాకు నత్రజని 60-72 కిలోలు, భాస్వరం 24కిలోలు సరిపోతుంది. మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను పంట విత్తే సమయంలో వేయాలి. నత్రజని మూడు దఫాలుగా సమానంగా, విత్తేటప్పుడు ఓసారి, 30-35 రోజులకు రెండోసారి, పూత దశలో మూడోసారి చేయాలి. భూమిలో జింక్ లోపం ఉంటే ఎకరాకు 20 కిలోల జింక్ సల్పేట్ వేసుకోవాలి. కలుపు నివారణకు విత్తిన 1-2 రోజుల్లో ఎకరాకు ఒక కిలో అట్రాజిన్ కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 25-30 రోజుల అనంతరం అంతర కృషి చేసి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.
చీడపీడల నివారణ..
తీపి మక్కను కాండం తొలుచు పురుగు ఎక్కువగా అశించి నష్టం చేస్తుంది. ఇవి ఆకులపై గుండ్రటి చిల్లులు చేసి, కాండంలో ఎస్ ఆకారంలో సొరంగాలు చేస్తాయి. తర్వాత మొక్క చనిపోతుంది. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే కోరాజిన్ 0.3మి.లీ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ముఖ్యంగా పంటల్లో క్రిమిసంహారక మందులు వాడేటప్పుడు ఒక్కటికి రెండుసార్లు సమీప వ్యవసాయాధికారులు లేదా వ్యవసాయ శాస్త్రవేత్తలను అడిగి ఉపయోగించడం మంచిది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి తపాస్పల్లి రిజర్వాయర్కు గోదావరి జలాలను తరలించేందుకు లింకు కాల్వల నిర్మాణానికి రూ.388.20 కోట్లు మంజూరయ్యాయి. ఈ ప్రాంత ప్రజల తరపున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. కరువు ప్రాంతంగా పిలువబడే చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు ఇది ఒక వరం. ఒక నాడు కరువు ప్రాంతంగా పిలువబడ్డ ఈ ప్రాంతం ఇవాళ గోదావరి జలాలతో సస్యశ్యామలం కానున్నది. ఈ ప్రాంతంలో సాగు నీటికి కొరత ఉండకూడదు. ప్రతి చెరువు, కుంటను గోదావరి జలాలతో నింపుతాం. ఈ ప్రాంత రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఇవాళ నిధులు మంజారు చేసింది. సాగు నీటి రంగంపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. ఆ ఫలాలు రైతులకు అందుతున్నాయి. మండటెండల్లో సైతం గోదావరి జలాలతో మత్తళ్లు దుంకినాయి.
కలియుగ భగీరథుడు సీఎం కేసీఆర్..
కలియుగ భగీరథుడు సీఎం కేసీఆర్. తాగు నీటికి తల్లడిల్లిన ప్రాంతాలకు నిండుగా సాగు నీరు అందించేందుకు నిర్మించిన తపాస్పల్లి రిజర్వాయర్కు మల్లన్నసాగర్ నుంచి నీటిని సరఫరా చేసేందుకు రూ.388.20కోట్ల నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. ఉద్యమ సమయంలో జనగామ, చేర్యాల ప్రాంతంలో సీఎం కేసీఆర్ స్వయంగా తిరిగి ఇక్కడి పరిస్థితులు తెలుసుకున్న వ్యక్తిగా మల్లన్నసాగర్ నుంచి తపాస్పల్లికి నీళ్లు ఇచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారు. రెండేండ్లుగా నేను పడ్డ కష్టానికి ఇప్పుడు మోక్షం లభించింది. తపాస్పల్లి నుంచి నీళ్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిది.