జూబ్లీహిల్స్ : ఒకవ్యక్తి తాను చనిపోయాక తన ఆస్తిని మసీదు కమిటీకి దారాదత్తం చేస్తున్నట్లు వీలునామా రాశాడు. అయితే కబ్జాదారులు ఆ ఆస్తిని కాజేయాలని చూస్తున్నట్లు మసీదు కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. యూసుఫ్గూడకు చెందిన మహ్మద్ సాజిద్మియాకు హైలం కాలనీలో 200 గజాల ఇంటి స్థలం ఉంది.
ఇటీవల అతని భార్య అనారోగ్యంతో మృతి చెందగా డయాలసిస్ పేషెంట్గా ఉన్న సాజిద్ (58) సోమవారం మృతి చెందాడు. తమకు పిల్లలు కూడా లేకపోవడంతో పాటు తాను డయాలసిస్ పేషెంట్ కావడంతో తన తరువాత.. తన ఆస్తి మసీదు కమిటీకి విరాళంగా ప్రకటించాడు.
అంతేకాక మసీదు కమిటీతో కలిసి తన ఆస్తులను తాను బ్రతికుండగానే 7 నెలల క్రితం ‘షెహజాది షాహీం’ వెల్ఫేర్ ట్రస్ట్ పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. దాత అకాలమరణంతో అతని ఆస్తిపై హక్కుదారులుగా యూసుఫ్గూడకు చెందిన జామే మజీద్ మహ్మదీ ఆధ్వర్యంలో స్థానిక నాలుగు మసీదులు వ్యవహరిస్తాయని సదరు కమిటీ ప్రకటించింది.
అయితే మృతుడి బంధువుల పేరున కొంతమంది కబ్జదారులు అతని ఆస్తులను కాజేయాలని చూస్తున్నారని మసీదు కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం మసీదు ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించి కబ్జాదారుల నుంచి ట్రస్ట్ ఆస్తులను కాపాడాలని కోరారు. ఈ మేరకు పోలీసు అధికారులకు ఫిర్యాదుచేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు