వేల్పూర్ మండల కేంద్రంలోని పెద్దవాగుపై నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున పనుల్లో వేగం పెంచాలన్నారు. మంత్రి పనులను శుక్రవారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వేల్పూర్, మే 13: మండల కేంద్రంలోని పెద్దవాగుపై రూ. 15కోట్లతో చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్,శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. మంత్రి వెంట ఆర్అండ్బీ ఏఈ నర్స య్య, భీమ్గల్ ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, రామన్నపేట్ విండో చైర్మన్ మోహన్రెడ్డి, సర్పంచులు సుధాకర్గౌడ్, గంగారెడ్డి, భీమ్గల్ టీఆర్ఎస్ మండల కన్వీనర్ దొన్కంటి నర్సయ్య తదితరులు ఉన్నారు.
భీమ్గల్ మండలంలోని గోన్గొప్పుల గ్రామానికి శనివారం మంత్రి వేముల రానున్నారు. గ్రామశివారులో రూ. 3.20 కోట్ల తో చేపట్టనున్న రెండు ఆర్అండ్బీ బ్రిడ్జి ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.