మూసాపేట(అడ్డాకుల), ఏప్రిల్ 16 : రైతుబాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి అన్నారు. మండలంలోని పొన్నకల్ గ్రామంలో శుక్రవారం ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పండించిన ధా న్యాన్ని విక్రయించేందుకు రైతులు ఇబ్బందు లు పడొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారుల సూచన మేరకు ధాన్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కల్పనావిజయకుమార్రెడ్డి, పీఏసీసీఎస్ డైరెక్టర్ కావలి కృష్ణయ్య, ఏఈవో చక్రవర్తి, గ్రామస్తులు పుల్లయ్యగౌడ్, మన్యంకొండయాదవ్, ధర్మారెడ్డి, కావలి సాయిలు, కర్నె వేణయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఇగ్నో అడ్మిషన్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
IPL 2021: ధోనీని మోటివేట్ చేసిన ఏఆర్ రెహమాన్.. లగాన్ సాంగ్ అంకితం