కొండాపూర్ : తైక్వాండో పోటీల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న చందానగర్ యువకుడిని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. బుధవారం మోప్ ఫౌండేషన్ అందజేసిన రూ. 20 వేల చెక్కును మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా యువ క్రీడాకారుడు ముకుల్ సాయికి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సమిస్తుందన్నారు. మెరుగైన సౌకర్యా లను కల్పిస్తూ ప్రత్యేక శిక్షణను అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ కుమార్, కంది జ్ఞానేశ్వర్, రోమిత్ ముదిరాజ్, సాయి తదితరులు పాల్గొన్నారు.