వనస్థలిపురం : మల్లికార్జున భక్త సమాజం అధ్యక్షుడు ముద్దగౌని సతీష్కుమార్గౌడ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఓ పేదజంట వివాహానికి పుస్తె మెట్టెలు అందజేశారు.
సాహెబ్నగర్కు చెందిన జంట మధు, అంజలిల వివాహం బుధవారం జరిగింది. వారి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సహాయం చేయాలన్న సంకల్పంతో పుస్తె మెట్టెలు అందజేశాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి పేదలకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు, వధువరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.