చైర్ పర్సన్, వైస్ చైర్మన్తో విభేదాలు లేవు
ఎమ్మెల్యే గండ్ర ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధికి కృషి
విలేకరుల సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు
కృష్ణకాలనీ, ఏప్రిల్ 3 : మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని అధికారుల నిర్లక్ష్యం వల్లే బహిష్కరించామని టీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్లు విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి వారం ముందు సమాచారం ఇవ్వాల్సిన అధికారులు ఒకరోజు ముందు ఇవ్వడంతో వారిని ప్రశ్నించామని స్పదించకపోవడంతోనే సమావేశాన్ని బహిష్కరించినట్లు చెప్పారు. దానికి తోడు పది రోజుల క్రితమే టీఆర్ఎస్ కౌన్సిలర్లమందరం మా ర్చి 30న మేడారం, లక్నవరం టూర్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నామని, టూర్ను వాయిదా వేసుకోలేక త ప్పని పరిస్థితిలో వెళ్లినట్లు చెప్పారు. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ మధ్య విభేదాల వల్లే సమావేశాన్ని బహిష్కరించినట్లు పత్రికల్లో వార్తలు రావడం బాధాకరమన్నారు. తమకు వారికి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సహకారంతో పట్టణాభివృద్ధికి పాటుపడుతామని తెలిపారు. 6న జరిగే మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి అందరం హాజరవుతామని వెల్లడించారు. టీఆర్ఎస్ కౌన్సిలర్లు బయపడే బడ్జెట్ సమావేశానికి హాజరుకాలేదని ప్రతిపక్ష కౌన్సిలర్లు మాట్లాడారని, వారు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. బడ్జెట్పై అవగాహనలేకే వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. భూపాలపల్లి పట్టణ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని తెలిపారు.
ప్రమాణం చేసింది నిజమే..
ఎమ్మెల్యే గండ్ర సహకారంతో భూపాలపల్లి పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని మేడారం సమ్మక్క-సారలమ్మ సాక్షిగా ప్రమాణం చేసినట్లు కౌన్సిలర్లు తెలిపారు. ప్రజలు తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, వారి అవసరాలు తీరుస్తామని చెప్పారు. సమావేంలో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీసిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబా బు, కౌన్సిలర్లు శిరుప అనిల్, ఎడ్ల మౌనిక శ్రీనివాస్, నాగవెళ్లి సరళా రాజలింగమూర్తి, పానుగంటి హరికా శ్రీనివాస్, మేకల రజితామల్లేశ్, మాడ కమలాలక్ష్మారెడ్డి, చల్ల రేణుక, ముంజంపల్లి మురళీధర్, ముంజాల రవీందర్, జక్కం రవికుమార్, బానోతు రజితాజుమ్ములాల్, ఆకుదారి మమతారాయమల్లు, మంగళపల్లి తిరుపతి, బద్ది సమ్మయ్య, చల్లూరి మమతాకమలాకర్, తొట్ల సంపత్, కో ఆప్షన్ మెంబర్ దొంగల ఐలయ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
మహారాష్ట్రలో 24 గంటల్లో 50వేల కేసులు..277 మరణాలు
ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్