బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని జడ్జీల నివాస సముదాయ ప్రాంగణంలోకి ప్రవేశించి చోరీకి యత్నించిన ఇద్దరు చిల్లర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతానికి చెందిన సయ్యద్ వజీర్ (35), చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన గణేష్ యాదవ్ (18) బంజారాహిల్స్లోని క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో ఫుట్పాత్పై ఉంటూ భిక్షాటన చేస్తుంటారు.
గురువారం సాయంత్రం బంజారాహిల్స్లోని జడ్జీల నివాస ప్రాంగణంలోకి ప్రవేశించిన వారిద్దరూ అక్కడున్న అల్యూ మినియం నిచ్చెనను చోరీ చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని సమీపంలో విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ గమనించి వారిని పట్టుకున్నాడు.
వారిని విచారించగా మద్యం డబ్బుల కోసం నిచ్చెనను దొంగిలించాలనుకున్నట్లు తేలింది. ఈ మేరకు వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.