చర్లపల్లి, డిసెంబర్ 20: టీఆర్ఎస్ అభ్యున్నతికి మణిపాల్రెడ్డి చేసిన సేవలు మరువలేనివని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పజ్జూరి మణిపాల్ రెడ్డి ఈ నెల 10న మృతి చెందారు. సోమవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్రెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, కార్పొరేటర్లతో కలిసి మంత్రి కేటీఆర్ దివంగత మణిపాల్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మణిపాల్రెడ్డి భార్య, మాజీ కార్పొరేటర్ పావనీమణిపాల్రెడ్డితో మాట్లాడి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకుడు మణిపాల్రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని.. ఏఎస్రావు నగర్ డివిజన్ అభివృద్ధితో పాటు పార్టీ పటిష్టతకు ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. మంత్రి వెంట కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, పన్నాల దేవేందర్రెడ్డి, ప్రభుదాస్, స్వర్ణరాజు, మాజీ కార్పొరేటర్లు రామారావు, ధన్పాల్రెడ్డి, అంజయ్య, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మహిపాల్రెడ్డి, కుమార్స్వామి, శేర్మణెమ్మ, సుదర్శన్రెడ్డి, సీతారామిరెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, రవికుమార్, సుధాకర్ ఉన్నారు.