ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
కొండాపూర్, డిసెంబర్ 20 : నేటి కాలంలో ప్రతీ పత్రికా ఏదో ఒక పార్టీకో లేదా ఏదో ఒక భావజాలానికో కట్టుబడి ఉన్న ధోరణి కనిపిస్తున్నదని, ఏ భావజాలానికి లోనుకాని జర్నలిజం కావాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మద్రాసు విశ్వవిద్యా లయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ధర్మనిధి ప్రసంగ పరంపరలో సోమవారం ఆయన ఎన్ఆర్ చందూర్ ధర్మనిది స్మారక ఉపన్యాసంగా తెలుగు జర్నలిజంలో నేటి ధోరణలు అనే అంశంపై ప్రసంగిం చారు. కరోనా తర్వాత తెలుగు జర్నలిజంలో అనూహ్య మైన మార్పులు వచ్చాయన్నారు. జర్నలిజానికి సంబం ధించి కొన్ని సూత్రాలు, నియమాలు ఉన్నాయని, వాటి ని పాటిస్తూ ఉన్నతమైన విలువలతో నడుపుతున్న పత్రిక లు, న్యూస్ చానెల్స్, వెబ్ న్యూస్ చానెల్స్ ఉన్నాయన్నా రు. మరికొన్ని సంచలనాలకు ప్రాధాన్యతను ఇస్తున్నాయని తెలిపారు. అనంతరం ఆయనను ఎన్ఆర్ చందూర్ ధర్మనిది స్మారక సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిర్మలా పళనివేలు, జి.మహేశ్వర్రెడ్డి, ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, ఎన్ఆర్. చందూర్ ధర్మనిధి పురస్కార సంఘం సభ్యులు రామకృష్ణ, మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీ రత్నాకర్, గుడిమెట్ల చెన్నయ్య, డాక్టర్ పాండురంగం కాళీయప్ప, డాక్టర్ మాదా శంకర్బాబు, మన్నారు కోటేశ్వరరావు పాల్గొన్నారు.