తిరుమల : శ్రీవారి భక్తులకు నిత్యం ఉచితంగా అన్నప్రసాద సేవలను అందిస్తున్న టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ( SV Annaprasadam Trust ) కు గురువారం రూ.11 లక్షల విరాళం ( Donation ) అందింది. బెంగుళూరుకు చెందిన హైషాని ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ విరాళాన్ని అందించింది.
ఈ మేరకు విరాళం డీడీని తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరికి సంస్థ ప్రతినిధులు అందజేశారు.ఈ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి . టోకెన్లు లేని భక్తులకు12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. స్వామివారిని బుధవారం 70,139 మంది భక్తులు దర్శించుకోగా 34,940 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.63 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.