తిరుమల : ఆపద మొక్కుల వాడు, ఆపద్భాందవుడు తిరుమల ( Tirumala ) వేంకటేశ్వర స్వామికి విరాళాలు కొనసాగుతున్నాయి. మంగళవారం హైదరాబాద్ ( Hyderabad ) కు చెందిన కల్లా సత్య రిషబ్ టీటీడీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం
ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనుందని ఆలయ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జూన్ 28న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసిందని వెల్లడించారు.