తిరుమల : ముంబైకి చెందిన విజయ్ రమేష్ చంద్ర అనే భక్తుడు టీటీడీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు ( Pranadana Trust ) రూ.1.03 కోట్లు విరాళంగా అందించారు.ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని అధికారులు వివరించారు. నిన్న 80,389 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 32,213 మంది తలనీలాలు సమర్పించుకున్నారు . భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా హుండీకి రూ. 3.50 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.