తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వసంత్సోవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఇవాళ స్వర్ణ రథోత్సవంపై మాడవీధుల్లో ఊరేగిన దృశ్యాన్ని భక్తులు కనులార తిలకించి పులకించిపోయారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దేవదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ రథోత్సవంలో పాల్గొన్నారు.
అనంతరంతిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లో కల్పిస్తున్న సౌకర్యాలను మంత్రి సత్యనారాయణ భక్తులను అడిగి తెలుసుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి వేచి చూడకుండా తక్కువ సమయంలో దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుతిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.
టికెట్ల జారీ కేంద్రం వద్ద సమస్యలను పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. ఇటీవల వరుస సెలవుల కారణంగా భక్తుల రద్దీ పెరగడం తో క్యూలైన్లో జరిగిన తొక్కిసలాటపై మంత్రి స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.