శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రం శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా గురువారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. పౌర్ణమి రోజు ఆలయ సాంప్రదాయంగా నిర్వహించే గిరిప్రదక్షిణ కార్యక్రమంలో భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేపు చేసి పూజాది క్రతువులు నిర్వహించి ఆలయ ప్రదక్షిణ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పల్లకీతో శ్రీకృష్ణ దేవరాయ గోపురం నుంచి గ్రామదేవత అంకాలమ్మ ఆలయం, నందిమండపం, వీరభద్రస్వామి ఆలయం మీదుగా అవుటర్ రింగ్ రోడ్డుగా శ్రీశైల శ్రీగిరి ప్రదక్షిణ జరుగుతుందని వివరించారు.