వందే వాంఛితలాభాయ
చంద్రార్ధాకృత శేఖరా
వృషారూఢాం శూలధరీం
శైలపుత్రీం మహేశ్వరీం॥
నవరాత్రుల్లో దుష్ట సంహారం చేసిన నవదుర్గల్లో మొదటిది శైలపుత్రి అవతారం. సాక్షాత్తు జగదాంబ పార్వతీదేవిగా అవతరించిన స్వరూపమిది. శైలం అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె. పర్వతరాజు తనయ పార్వతీదేవే శైలపుత్రి. ఈ జగత్తును రక్షించటం కోసం ఆ తల్లి ఒక దివ్య రూపాన్ని ధరించి వచ్చింది. అనేక కోట్ల శక్తుల ఏక స్వరూపమే శైలపుత్రి. ఈ తల్లి ఆరాధన ఒక సౌమ్యమైన జ్ఞాన స్థితిని కలుగచేస్తుంది.