తిరుమల : శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం కీలక సూచనలు చేసింది. భక్తులు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదంటే 48 గంటల ముందు తీసుకున్న ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించింది. ఇప్పటికే పలుసార్లు దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేసిన విషయం విధితమే. పలువురు భక్తులు నెగెటివ్ సర్టిఫికెట్ లేకుండా తిరుమలకు వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కి పంపుతున్నారు.
ఈ క్రమంలో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, దర్శనానికి 48 గంటల ముందు తీసుకున్న ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ను వెంట తెచ్చుకోవాలని సూచించింది. అలిపిరి చెక్పాయింట్ వద్ద ఆయా పత్రాలు చూపించిన వారిని మాత్రమే కొండపై అనుమతిస్తారని స్పష్టం చేసింది. భక్తుల తమ ఆరోగ్యంతో పాటు టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని, సహకరించాలని విజ్ఞప్తి చేసింది.