చెన్నై : యూపీలో మహిళలపై దారుణాలకు తెరపడటం లేదు. మధురలో 32 ఏండ్ల మహిళ గురువారం దారుణ హత్యకు గురైంది. మహిళను పదునైన ఆయుధంతో హత్య చేశారు. శివనగర్ కాలనీలో భర్తతో కలిసి అద్దె ఇంట్లో బాధితురాలు నివసిస్తోందని పోలీసులు తెలిపారు.
హత్యకు గల కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యానంతరం ఇంటి నుంచి భర్త అదృశ్యమవడంతో అతడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
హత్యోదంతం గురించి స్ధానికులు పోలీసులకు తెలపడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.