పెళ్లైన కొన్ని సంవత్సారాల తరువాత ఇద్దరు పిల్లలు కలిగిన దంపతుల మధ్య గొడవలు పెరిగాయి. దీని ఆ భార్య తన భర్తకు రాత్రివేళ భోజనంలో నిద్ర మాత్రలు కలిపి పెట్టింది. ఆ భోజనం చేసిన భర్త నిద్రపోయినప్పుడు.. ఆమె ఒక సుత్తి తీసుకొని అతని తలపైన బలంగా కొట్టింది. దీంతో అతను నిద్రలోనే మరణించాడు. కానీ ఆమె అతడిని చంపడానికి కారణం కేవలం గొడవలు కావు. అసలేం జరిగిందంటే..
మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్కు చెందిన వ్యాపార వేత్త ధన్రాజ్ తన భార్యతో సంగీతతో తరుచూ గొడవలు జరిగేవి. వారిద్దరికీ ఒక కొడుకు, ఒక కూతురు సంతానం. భర్తతో ఉండడం ఇష్టంలేక సంగీత ఒకరోజు రాత్రి భోజనంలో 10 నిద్ర మాత్రలు కలిపింది. ఆ భోజనం తిన్న ధన్రాజ్ నిద్రమత్తులో ఉండగా.. సంగీత సుత్తి తీసుకొని అతడి తలపై బలంగా కొట్టింది. అలా అతను చనిపోయినంతవరకు కొట్టింది. ఆ తరువాత తన పక్కింట్లో నివసించే అశోక్ పాండేకు ఫోన్ చేసి శవాన్ని దాచేందుకు సహాయం చేయమని అడిగింది.
అశోక్ పాండ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. అశోక్తో సంగీతల మధ్య వివాహేతర సంబంధం ఉంది. కొన్నిరోజుల క్రితం వీరిద్దరినీ ఒక గదిలో శృంగారం చేసుకుంటుండగా.. ధన్రాజ్ చూసాడు. కానీ పిల్లల కోసం తన కోపాన్ని దిగమింగుకొని ఆమెకు చివరి అవకాశం ఇచ్చాడు. ధన్రాజ్ వల్ల ఇద్దరు ప్రేమికుల కలుసుకోలేక ఇబ్బంది పడేవారు. దీంతో సంగీత.. అశోక్ చేత నిద్ర మాత్రలు తెప్పించి భర్తకు భోజనంలో కలిపి పెట్టింది. ఆ తరువాత అతడిని హత్య చేసింది.
హత్య చేసిన తరువాత తన ప్రియుడు అశోక్తో కలిసి ధన్రాజ్ శవాన్ని దాచేయాలనకుంది. కానీ అశోక్ ఈ విషయంలో కాస్త భయపడ్డాడు. అందుకే సంగీత రాత్రి ఫోన్ చేసి పిలిచినా.. ఆలోచిస్తూ ఉదయం వరకూ ఇంట్లోనే ఆగిపోయాడు. ఆ తరువాత సంగీత అతడిని బెదిరించేసరికి తెల్లవారుఝామున సంగీత వద్దకు వెళ్లాడు. అప్పటివరకు సంగీత నిద్రపోలేదు. భర్త శవం పక్కనే కూర్చొని ఉంది. ఆ తరువాత ఇద్దరూ కలిసి ధన్రాజ్ శవాన్ని అశోక్ కారు డిక్కీలో దాచి ఊరంతా తిరిగారు. ఎక్కడా సరైన స్థలం దొరకకపోవడంతో అశోక్ కంగారు పడి ఇక సంగీత చేసిన నేరంలో భాగస్వామి కాకూడదని భావించి.. ఏకంగా పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు.
అక్కడ జరిగినదంతా పోలీసులకు చెప్పి.. లొంగిపోయాడు. పోలీసులు అశోక్, సంగీతలను హత్యానేరం కింద అరెస్టు చేశారు.