ముంబై: గన్స్తో బెదిరించిన ముగ్గురు వ్యక్తులు, ఒక ఆఫీస్ నుంచి కోటి రూపాయలు దోచుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ములుంద్లోని పంచ రాస్తా ప్రాంతంలో ఆర్థిక సేవలందించే ఒక సంస్థలోకి ముగ్గురు వ్యక్తులు చొరబడ్డారు. తుపాకులు చూపించి ఆ కార్యాలయంలోని ఉద్యోగులను బెదిరించారు. ఆ సమయంలో ఆ ఆఫీస్లో ఉన్న కోటి నగదును దోచుకున్నారు. రెండు బ్యాగుల్లో ఆ డబ్బులు పెట్టుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
కాగా, ఈ దోపిడీ అంతా ఆ కార్యాలయంలోని సీసీటీవీలో రికార్డైంది. ఆ సంస్థ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి దోపీడీకి పాల్పడ్డ వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు పట్ట పగలు, జన రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ దోపిడీ జరుగడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఆ ఆఫీస్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH A case has been registered against 3 unidentified miscreants who robbed around Rs 1 crore from an office at 'gunpoint' in the Mulund area of Mumbai (02.02)
(Video Source: Mumbai Police) pic.twitter.com/vLoVdvrPcw
— ANI (@ANI) February 2, 2022